Begin typing your search above and press return to search.
అంత సున్నితమైతే భార్య చనిపోయేవారా శశి?
By: Tupaki Desk | 30 July 2015 8:53 AM GMTరాజకీయ నాయుడి నంగనాచి మాటలకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తారు సీనియర్ కాంగ్రెస్ నేత.. ఎంపీ శశిథరూర్. ఆయనకు ఉన్నట్లుండి మానవత్వం పొంగి పొర్లింది. తనలోని సున్నితత్వం కోణాన్ని టన్నుల కొద్దీ తెలియజేసేలా ఆయన తాజాగా వ్యాఖ్యానించి చాలామందికి షాకిచ్చే ప్రయత్నం చేశారు.
ఉగ్రవాద కాల్పులలో 257 మంది మృతికి కారణమైన ఘటనలో దోషిగా నిరూపితమై.. గురువారం ఉదయం ఉరిశిక్ష అమలు అయిన యాకూబ్ మెమన్ పై సింపతీ సెంటును తన ట్వీట్ కు పూసి జనం మీదకు వదిలారు.
అయ్యగారికి యాకూబ్ మరణం విపరీతమైన బాధను మిగిల్చిందంట. మన ప్రభుత్వం ఒక మనిషిని ఉరి తీసిందన్న వార్త తనను చాలా బాధ పెట్టిందని.. మరణదండన వల్ల ప్రతికూల ఫలితాలే కానీ సానుభూతి ఫలితాలు వచ్చిన దాఖలాలు లేవంటూ ఏదో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కక్ష సాధింపు చర్య.. ప్రతీకార హత్య తప్పించి మరొకటి కాదని సెలవిచ్చారు.
శశిథరూర్ నిజంగా అంత మానవతావాదే అయితే.. ఆయన సతీమణి సునంద పుష్కర్ సందేహాస్పదంగా ఎలా మృతి చెందినట్లు? సొంత పెళ్లాం మృతి మిస్టీరియస్ గా మారితే దాని మీద సంతృప్తికరంగా సమాధానం చెప్పలేని శశిథరూర్.. ఉగ్రవాద చర్యలతో సంబంధం ఉన్న వ్యక్తిని ఉరి తీయటాన్ని తెగ బాధ పడిపోతున్నారు.
రాజకీయ ఒత్తిడితో శశిథరూర్ సతీమణి.. సునంద పుష్కర్ పోస్టమార్టం నివేదికను తప్పుగా ఇచ్చినట్లుగా వైద్యులు సైతం ఒప్పుకున్న విషయాన్ని శశిథరూర్.. యాకూబ్ మెమన్ లాంటి వ్యక్తిని ఉరి తీసిన బాధలో మర్చిపోవచ్చు కానీ సగటు భారతీయుడు మర్చిపోలేదు. వందలాది మందిని పొట్టన పెట్టుకున్న ఒక దోషి మరణం ఇంతలా ఆయన్ను కలిచి వేస్తే.. తన భార్య మరణం మరింత కుంగదీయాలి కదా? అయినప్పటికీ నిక్షేపంగా ఎలా ఉండగలుగుతున్నారు?
ప్రేమించి పెళ్లాడిన పెళ్లాం చనిపోతే.. అది ఆత్మహత్య అన్నట్లుగా అయ్యగారు చెబితే.. విష ప్రయోగం జరిగిందన్న వైద్యుల విరుద్ధ మాటకు ఇంతవరకూ సంతృప్తికర సమాధానం ఇవ్వలేని శశిథరూర్.. ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వ్యక్తులకు అనుకూలంగా మాట్లాడటం చూసినప్పుడు మనసు ఏదోలా అనిపిస్తే.. అది శశిథరూర్ తప్పు కాదు. ఆయనలోని సున్నితత్వాన్ని గుర్తించలేని వారిదే. అంతేకదా శశి..!
ఉగ్రవాద కాల్పులలో 257 మంది మృతికి కారణమైన ఘటనలో దోషిగా నిరూపితమై.. గురువారం ఉదయం ఉరిశిక్ష అమలు అయిన యాకూబ్ మెమన్ పై సింపతీ సెంటును తన ట్వీట్ కు పూసి జనం మీదకు వదిలారు.
అయ్యగారికి యాకూబ్ మరణం విపరీతమైన బాధను మిగిల్చిందంట. మన ప్రభుత్వం ఒక మనిషిని ఉరి తీసిందన్న వార్త తనను చాలా బాధ పెట్టిందని.. మరణదండన వల్ల ప్రతికూల ఫలితాలే కానీ సానుభూతి ఫలితాలు వచ్చిన దాఖలాలు లేవంటూ ఏదో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కక్ష సాధింపు చర్య.. ప్రతీకార హత్య తప్పించి మరొకటి కాదని సెలవిచ్చారు.
శశిథరూర్ నిజంగా అంత మానవతావాదే అయితే.. ఆయన సతీమణి సునంద పుష్కర్ సందేహాస్పదంగా ఎలా మృతి చెందినట్లు? సొంత పెళ్లాం మృతి మిస్టీరియస్ గా మారితే దాని మీద సంతృప్తికరంగా సమాధానం చెప్పలేని శశిథరూర్.. ఉగ్రవాద చర్యలతో సంబంధం ఉన్న వ్యక్తిని ఉరి తీయటాన్ని తెగ బాధ పడిపోతున్నారు.
రాజకీయ ఒత్తిడితో శశిథరూర్ సతీమణి.. సునంద పుష్కర్ పోస్టమార్టం నివేదికను తప్పుగా ఇచ్చినట్లుగా వైద్యులు సైతం ఒప్పుకున్న విషయాన్ని శశిథరూర్.. యాకూబ్ మెమన్ లాంటి వ్యక్తిని ఉరి తీసిన బాధలో మర్చిపోవచ్చు కానీ సగటు భారతీయుడు మర్చిపోలేదు. వందలాది మందిని పొట్టన పెట్టుకున్న ఒక దోషి మరణం ఇంతలా ఆయన్ను కలిచి వేస్తే.. తన భార్య మరణం మరింత కుంగదీయాలి కదా? అయినప్పటికీ నిక్షేపంగా ఎలా ఉండగలుగుతున్నారు?
ప్రేమించి పెళ్లాడిన పెళ్లాం చనిపోతే.. అది ఆత్మహత్య అన్నట్లుగా అయ్యగారు చెబితే.. విష ప్రయోగం జరిగిందన్న వైద్యుల విరుద్ధ మాటకు ఇంతవరకూ సంతృప్తికర సమాధానం ఇవ్వలేని శశిథరూర్.. ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వ్యక్తులకు అనుకూలంగా మాట్లాడటం చూసినప్పుడు మనసు ఏదోలా అనిపిస్తే.. అది శశిథరూర్ తప్పు కాదు. ఆయనలోని సున్నితత్వాన్ని గుర్తించలేని వారిదే. అంతేకదా శశి..!