Begin typing your search above and press return to search.

కంఫర్ట్ ఉమెన్ కు 100 మిలియన్లు పరిహారం!

By:  Tupaki Desk   |   26 Aug 2016 8:38 AM GMT
కంఫర్ట్ ఉమెన్ కు 100 మిలియన్లు పరిహారం!
X
1939 - 1945 మధ్యకాలంలో జరిగిన అత్యంత దారుణమైన సంఘటన - లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయిన సందర్భం రెండో ప్రపంచ యుద్దం. నాడు జరిగిన సంఘటనల గురించి, జరిగిన దారుణాల గురించి ఎంతచెప్పుకున్నా తక్కువనే చెప్పాలి. అయితే ఈ రెండో ప్రపంచ యుద్ద సమయంలో జపాన్ - కొరియాల మధ్య జరిగిన ఒక సంఘటన అత్యంత దారుణమనే చెప్పాలి. ఈ సమయంలో ఇబ్బంది పడిన లక్షమంది కొరియన్లలో కొంతమంది మహిళలకు తాజాగా చిన్నపాటి పరిహారం దొరికింది.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లక్ష మంది వరకూ కొరియన్లు జపాన్ సామ్రాజ్య సైన్యంలో బలవంతంగా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో "కంఫర్ట్ ఉమెన్" పేరుతో కొంతమంది కొరియన్ స్త్రీలు జపాన్ సైన్యానికి బానిసలుగా సేవలు చేయవలసిన దుస్థితి ఎదురైంది. అలా వెళ్లిన వారిలో 146 మంది బాధిత మహిళల్లో ప్రస్తుతం 46 మంది మాత్రమే జీవించి ఉన్నారు. అయితే ఈ అభాగినులకు 100 మిలియన్లు (90వేల డాలర్లు) పరిహారాన్ని అందించడానికి జపాన్ ముందుకొచ్చిందట. ఈ విషయాన్ని దక్షిణ కొరియా ప్రకటించిది.

రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ సైనికులు చేతిలో బంధీలుగా చిక్కి దశాబ్దాల పాటు సెక్స్ బానిసలుగా పనిచేస్తూ నరకయాతన అనుభవించిన ఈ దక్షిణ కొరియా మహిళా బాధితులకు ఎట్టకేలకు ఈ రూపంలో పరిహారం లభించనుంది. ఈ బాధిత మహిళల సహాయార్థం గత నెలలో సియోల్ లో ఏర్పాటు చేసిన ఒక ఫౌండేషన్ కు ఒక మిలియన్ యెన్ ను (9.9 మిలియన్ డాలర్లు) ను జపాన్ బదిలీ చేయనుందని కొరియా విదేశాంగ శాఖ తెలిపింది.