Begin typing your search above and press return to search.
రోజా మాట: బాబు ఓ అస్తమించే సూర్యుడు
By: Tupaki Desk | 12 Feb 2016 12:31 PM GMTవైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే - ఫైర్ బ్రాండ్ లేడీ లీడర్ రోజా మరోమారు తనదైన శైలిలో టీడీపీపై మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు పలువురు టీడీపీలో చేరనున్నారనే వార్తలు రావడం, వాటిని వైసీపీ ఎమ్మెల్యేలు ఖండించడం తదితర పరిణామాల నేపథ్యంలో రోజా తాజాగా విలేకరుల సమావేశంలో చంద్రబాబు సర్కారుపై విరుచుకుపడ్డారు. టీడీపీ ఓ మునిగిపోయే పడవ అని ఎద్దేవా చేస్తూ అందులోకి ఎవరు చేరినా మరింత వేగంగా మునిగిపోతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబునాయుడు పార్టీలో ఉన్నవారంతా తామున్నది పల్లకిలో అని భావిస్తున్నారని, అది పాడే అనే విషయం త్వరలోనే తెలుస్తుందని రోజా చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి విఫలం అవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. అసలు ఏం చూసి టీడీపీలోకి చేరాలని రోజా ప్రశ్నించారు.
ప్రజలంతా తెలుగుదేశం పార్టీని, టీడీపీ ఎమ్మెల్యేలను అసహ్యించుకుంటున్నారని, అలాంటి పార్టీలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా చేరతారని రోజా ప్రశ్నించారు. టీడీపీ చేస్తుంది పనికి రాని పాలన అని రోజా దుయ్యబట్టారు. జన్మభూమి పేరిట తెలుగుదేశం సొంత కమిటీలు వేసుకొని ప్రజాప్రతినిధులను పక్కన పెట్టిందని మండిపడ్డారు. ఫించన్లు రద్దు చేస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని ద్వజమెత్తారు. తమ పార్టీ నేతలు టీడీపీలో చేరుతారనే ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై త్వరలో కేసులు పెట్టనున్నట్లు రోజా తెలిపారు.
హైదరాబాద్ ను నేనే అభివృద్ధి చేశాను, నాకు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు తగిన రీతిలో హైదరాబాద్ ఓటర్లు గుణపాఠం చెప్పి ఒక్క స్థానానికే పరిమితం చేశారని రోజా ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబుకు రెండు ఎమ్మెల్యే స్థానాలకు మించి దక్కవని ఆమె జోస్యం చెప్పారు. చంద్రబాబు అస్తమించే సూర్యుడయితే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఉదయించే సూర్యుడని రోజా పొగిడారు.
ప్రజలంతా తెలుగుదేశం పార్టీని, టీడీపీ ఎమ్మెల్యేలను అసహ్యించుకుంటున్నారని, అలాంటి పార్టీలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా చేరతారని రోజా ప్రశ్నించారు. టీడీపీ చేస్తుంది పనికి రాని పాలన అని రోజా దుయ్యబట్టారు. జన్మభూమి పేరిట తెలుగుదేశం సొంత కమిటీలు వేసుకొని ప్రజాప్రతినిధులను పక్కన పెట్టిందని మండిపడ్డారు. ఫించన్లు రద్దు చేస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని ద్వజమెత్తారు. తమ పార్టీ నేతలు టీడీపీలో చేరుతారనే ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై త్వరలో కేసులు పెట్టనున్నట్లు రోజా తెలిపారు.
హైదరాబాద్ ను నేనే అభివృద్ధి చేశాను, నాకు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు తగిన రీతిలో హైదరాబాద్ ఓటర్లు గుణపాఠం చెప్పి ఒక్క స్థానానికే పరిమితం చేశారని రోజా ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబుకు రెండు ఎమ్మెల్యే స్థానాలకు మించి దక్కవని ఆమె జోస్యం చెప్పారు. చంద్రబాబు అస్తమించే సూర్యుడయితే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఉదయించే సూర్యుడని రోజా పొగిడారు.