Begin typing your search above and press return to search.
బాబు చేతగానితనం..పవన్ కు ప్యాకేజీ వరం
By: Tupaki Desk | 7 Dec 2017 7:48 AM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై మరోమారు ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు చేతగానితనం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు - నేతలు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ జాతీయ హోదా ఉన్న పోలవరం ప్రాజెక్టును తానే నిర్మిస్తామని ముందుకు పోయిన సీఎం చంద్రబాబు... అనంతరం తన లాభాల కోసం ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి కానీయకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని రోజా మండిపడ్డారు. విభజన చట్టంలోని ఏపీకి ప్రత్యేకహోదా సహా ఎన్నో అంశాలను చంద్రబాబు పక్కన పెట్టారని రోజా మండిపడ్డారు. అదే జాబితాలో పోలవరం ప్రాజెక్టు కూడా చేరిందన్నారు. చంద్రబాబు ఏలుబడిలో ఏనాడు ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదని రోజా మండిపడ్డారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత - సినీనటుడు పవన్ కళ్యాణ్ గురించి సైతం రోజా మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఏం తెలుసని పవన్ మాట్లాడుతున్నారని రోజా నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల అని పేర్కొంటూ...ప్రస్తుత సీఎం చంద్రబాబు వల్లే ఆ ప్రాజెక్ట్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయిందని గమనించాలన్నారు.
ఈ సందర్భంగా పవన్ పొలిటికల్ జర్నీపై రోజా విరుచుకుపడ్డారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్...తను వారసత్వంగానే సినిమాల్లోకి వచ్చాననే విషయాన్ని గమనించాలన్నారు. అసలు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదని..ఆయనో ప్యాకేజీ ఆర్టిస్టు అని రోజా విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకే...ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు దక్కుతున్న ఆదరణను తక్కువచేసేందుకే...పవన్ అప్పుడప్పుడు కనిపిస్తుంటారని రోజా విమర్శించారు. చిరంజీవిని మోసం చేసిన వారి జాబితాలో పవన్ కూడా బాధ్యత వహించాలన్నారు. అల్లూ అరవింద్ - చంద్రబాబు నాయుడు - ఆయనకు డబ్బా కొట్టే టీవీ చానల్లు చిరును దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించాయని రోజా ఆరోపించారు.
తన మిత్రుడైన ఏబీఎన్ సంస్థల అధినేత రాధాకృష్ణ పత్రిక ఆఫీసు తగలబడితే వెంటనే వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ..కృష్ణా నది బోటు ప్రమాదం బాధితులను సందర్శించేందుకు మాత్రం సమయం దొరకలేదని రోజా ఎద్దేవా చేశారు. బోటు ప్రమాద బాధితులను పవన్ పరామర్శించడాన్ని తాము తప్పుపట్టడం లేదని అయితే... బాబు తీరును పవన్ ఎందుకు ప్రశ్నించరని రోజా నిలదీశారు. దీంతో పాటుగా ప్రత్యేక హోదా, దానికి బదులుగా ఇస్తానని హామీ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ - పోలవరం ప్రాజెక్టు - రాజధాని నిర్మాణం వంటి విషయాల్లో పవన్ స్పందన ఏదని రోజా ప్రశ్నించారు. ప్రజల్లోకి వచ్చి ప్రసంగించినప్పుడల్లా నాలుగు పంచ్ డైలాగ్ లు పేల్చడం..దానికి వచ్చిన స్పందనతో ఖుస్ అవడంతోనే..పవన్ సంతోషపడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నిలదీయకుండా..విపక్ష నేతపై విమర్శలు చేస్తున్న పవన్ తీరును నేతలంతా గమనిస్తున్నారని రోజా స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని రోజా మండిపడ్డారు. విభజన చట్టంలోని ఏపీకి ప్రత్యేకహోదా సహా ఎన్నో అంశాలను చంద్రబాబు పక్కన పెట్టారని రోజా మండిపడ్డారు. అదే జాబితాలో పోలవరం ప్రాజెక్టు కూడా చేరిందన్నారు. చంద్రబాబు ఏలుబడిలో ఏనాడు ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదని రోజా మండిపడ్డారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత - సినీనటుడు పవన్ కళ్యాణ్ గురించి సైతం రోజా మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఏం తెలుసని పవన్ మాట్లాడుతున్నారని రోజా నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల అని పేర్కొంటూ...ప్రస్తుత సీఎం చంద్రబాబు వల్లే ఆ ప్రాజెక్ట్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయిందని గమనించాలన్నారు.
ఈ సందర్భంగా పవన్ పొలిటికల్ జర్నీపై రోజా విరుచుకుపడ్డారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్...తను వారసత్వంగానే సినిమాల్లోకి వచ్చాననే విషయాన్ని గమనించాలన్నారు. అసలు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదని..ఆయనో ప్యాకేజీ ఆర్టిస్టు అని రోజా విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకే...ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు దక్కుతున్న ఆదరణను తక్కువచేసేందుకే...పవన్ అప్పుడప్పుడు కనిపిస్తుంటారని రోజా విమర్శించారు. చిరంజీవిని మోసం చేసిన వారి జాబితాలో పవన్ కూడా బాధ్యత వహించాలన్నారు. అల్లూ అరవింద్ - చంద్రబాబు నాయుడు - ఆయనకు డబ్బా కొట్టే టీవీ చానల్లు చిరును దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించాయని రోజా ఆరోపించారు.
తన మిత్రుడైన ఏబీఎన్ సంస్థల అధినేత రాధాకృష్ణ పత్రిక ఆఫీసు తగలబడితే వెంటనే వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ..కృష్ణా నది బోటు ప్రమాదం బాధితులను సందర్శించేందుకు మాత్రం సమయం దొరకలేదని రోజా ఎద్దేవా చేశారు. బోటు ప్రమాద బాధితులను పవన్ పరామర్శించడాన్ని తాము తప్పుపట్టడం లేదని అయితే... బాబు తీరును పవన్ ఎందుకు ప్రశ్నించరని రోజా నిలదీశారు. దీంతో పాటుగా ప్రత్యేక హోదా, దానికి బదులుగా ఇస్తానని హామీ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ - పోలవరం ప్రాజెక్టు - రాజధాని నిర్మాణం వంటి విషయాల్లో పవన్ స్పందన ఏదని రోజా ప్రశ్నించారు. ప్రజల్లోకి వచ్చి ప్రసంగించినప్పుడల్లా నాలుగు పంచ్ డైలాగ్ లు పేల్చడం..దానికి వచ్చిన స్పందనతో ఖుస్ అవడంతోనే..పవన్ సంతోషపడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నిలదీయకుండా..విపక్ష నేతపై విమర్శలు చేస్తున్న పవన్ తీరును నేతలంతా గమనిస్తున్నారని రోజా స్పష్టం చేశారు.