Begin typing your search above and press return to search.
బాబు విజన్ 2029 ఏంటో తెలుసా?
By: Tupaki Desk | 25 July 2016 4:14 PM GMTతెలుగు రాష్ర్టాల సారథులుగా నారా చంద్రబాబు నాయుడు - కే చంద్రశేఖర్ రావుల మధ్య పలు విబేధాలున్నప్పటికీ కొన్ని సారుప్యతలు కూడా ఉన్న విషయం తెలిసిందే. అభివృద్ధి కోణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు తీసుకునే నిర్ణయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తాజాగా విషయానికి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి హరితహారం పేరుతో ఆకుపచ్చ తెలంగాణకు అంకురం వేశారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే చంద్రబాబు నిర్ణయం వెనుక దూరదృష్టి ఉందని చెప్తున్నారు.
నవ్యాంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల 29న కోటి మొక్కలు నాటాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వెనుక హరిత ఆంధ్రప్రదేశ్ ఆలోచన ఉందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పటికీ హైదరాబాద్ - బెంగళూరుల్లో ఉన్న సొంత రాష్ట్ర ప్రజలు పెద్దగా నవ్యాంధ్రప్రదేశ్ వైపు తిరిగి వెళ్లలేదు. ఇలా రాకపోవడానికి కారణం ఏపీలో ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో ఉన్న వాతావరణ సమస్యలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రహించారని అంటున్నారు. అందుకే దశల వారీగా భారీస్థాయిలో మొక్కల పెంపకం ద్వారా - రాష్ట్రాన్ని హరితవనంగా మార్చేందుకు విజన్ 2029ను నిర్దేశించుకున్నారు. వాతావరణంలో వేడి తగ్గించి - చల్లదనం తీసుకురావాలంటే మొక్కల పెంపకం ఒక్కటే మార్గమని గుర్తించారు. అందులో తొలి అడుగుగా ఈ నెల 29న కోటి మొక్కలు నాటాలని నిర్ణయించారు.
సమైక్య రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా మొక్కలు పెంచడం ద్వారా వాతావరణ సమతుల్యం సాధించే ప్రయత్నం చేయలేకపోయాయి. అది ఇప్పుడు వలసలు వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు ప్రధాన అవరోధంగా మారిందని బాబు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపితే వలసలు తగ్గించడంతోపాటు - వెనక్కివెళ్లినవారిని తిరిగి తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. విభజనకు దశాబ్దాల ముందు వరకూ ఏపీకి చెందినవారు హైదరాబాద్ కు వలసవెళ్లారు. రాయలసీమకు చెందిన వారిలో ఎక్కువ మంది బెంగళూరు - నెల్లూరుకు చెందిన వారిలో అధిక శాతం చెన్నైకు వలస వెళ్లారు. హైదరాబాద్ లో వాతావరణం అనుకూలంగా ఉండటం - వేసవికాలంలో కూడా సాయం తర్వాత చల్లగా ఉండటం - ఉక్కపోత లేకపోవడంతో వలస వెళ్లిన ప్రజలు - హైదరాబాద్ వాతావరణానికి అలవాటుపడ్డారు. బెంగళూరులో ఉన్న చల్లటి వాతావరణానికి సీమవాసులు మమేకమయ్యారు. చెన్నైలోని వాతవరణానికి నెల్లూరు వాసులు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో వారు సొంత రాష్ర్టానికి వచ్చేందుకు పూర్తి ఆసక్తికనబర్చడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణా - గుంటూరు - ప్రకాశం - కడప - కర్నూలు - చిత్తూరు - అనంతపురం వంటి జిల్లాల్లో విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుంది. వేసవిలో 47 డిగ్రీలు కూడా దాటుతున్న సందర్భాలున్నాయి. రెంటచింతల - పిడుగురాళ్ల - గుంటూరు - విజయవాడ - దర్శి - ఒంగోలు వంటి ప్రాంతాల్లో జనం పిట్టల్లా రాలిపోతుంటారు. ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే చల్లటి వాతావరణం కనిపిస్తుంటుంది. దీంతో మొక్కలు నాటి పర్యావరణ సమతూల్యత సాధించడమే సరైన ప్రత్యామ్నాయంగా బాబు ప్రభుత్వం గుర్తించింది.
ప్రధానంగా అమరావతి చుట్టూ ఉన్న కృష్ణా - గుంటూరు - ప్రకాశం జిల్లాల్లో ఉండే అధిక ఉష్ణోగ్రత.. హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆయా జిల్లాల వారికి భయాందోళన కలిగిస్తోంది. ఈ భయంతోనే రాష్ట్రం విడిపోయి రెండేళ్లయినా హైదరాబాద్ - బెంగళూరుకు వెళ్లిన వారెవరూ అమరావతి పరిసర జిల్లాలకు - ఇతర ప్రాంతాలకు వెనక్కి రాలేకపోతున్నారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడున్న 25.64 శాతం పచ్చదనాన్ని 2029 నాటికి రెట్టింపు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 37వేల చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉండగా - భౌగోళిక విస్తీర్ణం ప్రకారం ఈ సంఖ్య 23 శాతం మాత్రమే. అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి - మొక్కల పెంపకం ద్వారా మరో 17 శాతం పచ్చదనం పెంచాలని భావిస్తోంది. వచ్చే ఐదేళ్లలో 6లక్షల హెక్టార్లకు పచ్చదనాన్ని విస్తరించాలని అటవీశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. దానికోసం 75 కోట్ల విత్తనాలు సిద్ధం చేసి - ఏపి ఏటా 15 కోట్ల విత్తనాలతో లక్ష్యాన్ని సాధించాలని యోచిస్తోంది. బాబు విజన్ ఏ మేరకు ఫలితం సాధిస్తుందో చూడాలి మరి.
నవ్యాంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల 29న కోటి మొక్కలు నాటాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వెనుక హరిత ఆంధ్రప్రదేశ్ ఆలోచన ఉందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పటికీ హైదరాబాద్ - బెంగళూరుల్లో ఉన్న సొంత రాష్ట్ర ప్రజలు పెద్దగా నవ్యాంధ్రప్రదేశ్ వైపు తిరిగి వెళ్లలేదు. ఇలా రాకపోవడానికి కారణం ఏపీలో ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో ఉన్న వాతావరణ సమస్యలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రహించారని అంటున్నారు. అందుకే దశల వారీగా భారీస్థాయిలో మొక్కల పెంపకం ద్వారా - రాష్ట్రాన్ని హరితవనంగా మార్చేందుకు విజన్ 2029ను నిర్దేశించుకున్నారు. వాతావరణంలో వేడి తగ్గించి - చల్లదనం తీసుకురావాలంటే మొక్కల పెంపకం ఒక్కటే మార్గమని గుర్తించారు. అందులో తొలి అడుగుగా ఈ నెల 29న కోటి మొక్కలు నాటాలని నిర్ణయించారు.
సమైక్య రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా మొక్కలు పెంచడం ద్వారా వాతావరణ సమతుల్యం సాధించే ప్రయత్నం చేయలేకపోయాయి. అది ఇప్పుడు వలసలు వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు ప్రధాన అవరోధంగా మారిందని బాబు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపితే వలసలు తగ్గించడంతోపాటు - వెనక్కివెళ్లినవారిని తిరిగి తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. విభజనకు దశాబ్దాల ముందు వరకూ ఏపీకి చెందినవారు హైదరాబాద్ కు వలసవెళ్లారు. రాయలసీమకు చెందిన వారిలో ఎక్కువ మంది బెంగళూరు - నెల్లూరుకు చెందిన వారిలో అధిక శాతం చెన్నైకు వలస వెళ్లారు. హైదరాబాద్ లో వాతావరణం అనుకూలంగా ఉండటం - వేసవికాలంలో కూడా సాయం తర్వాత చల్లగా ఉండటం - ఉక్కపోత లేకపోవడంతో వలస వెళ్లిన ప్రజలు - హైదరాబాద్ వాతావరణానికి అలవాటుపడ్డారు. బెంగళూరులో ఉన్న చల్లటి వాతావరణానికి సీమవాసులు మమేకమయ్యారు. చెన్నైలోని వాతవరణానికి నెల్లూరు వాసులు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో వారు సొంత రాష్ర్టానికి వచ్చేందుకు పూర్తి ఆసక్తికనబర్చడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణా - గుంటూరు - ప్రకాశం - కడప - కర్నూలు - చిత్తూరు - అనంతపురం వంటి జిల్లాల్లో విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుంది. వేసవిలో 47 డిగ్రీలు కూడా దాటుతున్న సందర్భాలున్నాయి. రెంటచింతల - పిడుగురాళ్ల - గుంటూరు - విజయవాడ - దర్శి - ఒంగోలు వంటి ప్రాంతాల్లో జనం పిట్టల్లా రాలిపోతుంటారు. ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే చల్లటి వాతావరణం కనిపిస్తుంటుంది. దీంతో మొక్కలు నాటి పర్యావరణ సమతూల్యత సాధించడమే సరైన ప్రత్యామ్నాయంగా బాబు ప్రభుత్వం గుర్తించింది.
ప్రధానంగా అమరావతి చుట్టూ ఉన్న కృష్ణా - గుంటూరు - ప్రకాశం జిల్లాల్లో ఉండే అధిక ఉష్ణోగ్రత.. హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆయా జిల్లాల వారికి భయాందోళన కలిగిస్తోంది. ఈ భయంతోనే రాష్ట్రం విడిపోయి రెండేళ్లయినా హైదరాబాద్ - బెంగళూరుకు వెళ్లిన వారెవరూ అమరావతి పరిసర జిల్లాలకు - ఇతర ప్రాంతాలకు వెనక్కి రాలేకపోతున్నారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడున్న 25.64 శాతం పచ్చదనాన్ని 2029 నాటికి రెట్టింపు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 37వేల చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉండగా - భౌగోళిక విస్తీర్ణం ప్రకారం ఈ సంఖ్య 23 శాతం మాత్రమే. అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి - మొక్కల పెంపకం ద్వారా మరో 17 శాతం పచ్చదనం పెంచాలని భావిస్తోంది. వచ్చే ఐదేళ్లలో 6లక్షల హెక్టార్లకు పచ్చదనాన్ని విస్తరించాలని అటవీశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. దానికోసం 75 కోట్ల విత్తనాలు సిద్ధం చేసి - ఏపి ఏటా 15 కోట్ల విత్తనాలతో లక్ష్యాన్ని సాధించాలని యోచిస్తోంది. బాబు విజన్ ఏ మేరకు ఫలితం సాధిస్తుందో చూడాలి మరి.