Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ తెలియ‌కుండా మాట్లాడొద్దు

By:  Tupaki Desk   |   23 Jan 2017 5:38 PM GMT
ప‌వ‌న్ తెలియ‌కుండా మాట్లాడొద్దు
X
పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్వాసితుల‌కు భ‌రోసా ఇవ్వ‌డ‌మ‌నే పేరుతో త‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించిన జనసేన పార్టీ అధినేత‌, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు ఘాటు రిప్లై ఇచ్చారు. విమ‌ర్శ‌లు చేసేముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్షేత్ర‌స్థాయి వాస్త‌వాలు, అస‌లు విష‌యాలు తెలుసుకోవాల‌ని కోరారు. పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో భూ సేక‌ర‌ణ చేసిన త‌ర్వాతే నిర్మాణ సంస్థ అయిన త‌మ‌కు స‌దరు ప్రాంతాల‌పై హ‌క్కు క‌ల్పించార‌ని రాయ‌పాటి వివ‌రించారు. అయితే ఈ వివ‌రాలు తెలియ‌కుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌పై, త‌న సంస్థ‌పై ఆరోప‌ణ‌లు చేశార‌ని మండిప‌డ్డారు. ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ ప్ర‌త్యేక హోదా పై స్పందించిన తీరును రాయ‌పాటి త‌ప్పుప‌ట్టారు. జ‌ల్లిక‌ట్టుతో ప్ర‌త్యేక హోదాను ముడిపెట్ట‌డం స‌రికాద‌న్నారు.

కాగా ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరుతూ విశాఖ‌లోని ఆర్కే బీచ్‌లో చేప‌ట్ట‌నున్న శాంతియుత ఆందోళ‌న కార్య‌క్ర‌మంపై కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు స్పందించారు. అభివృద్ధికి ప్ర‌త్యేక హోదా ఒక్క‌టే ప‌రిష్కారం కాద‌న్నారు. అదొక్క‌టే కార‌ణం అయితే...ప్ర‌త్యేక హోదా పొంది ప‌లు రాష్ట్రాలు ఇప్ప‌టివ‌ర‌కు ఎందుకు అభివృద్ధి చెంద‌లేద‌ని అశోక్ గ‌జ‌ప‌తిరాజు ప్ర‌శ్నించారు