Begin typing your search above and press return to search.

విరాట్ పై జడేజా పోకిరీ ట్వీట్!

By:  Tupaki Desk   |   24 Oct 2016 12:44 PM GMT
విరాట్ పై జడేజా పోకిరీ ట్వీట్!
X
తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా... ఈ డైలాగ్ మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ పోకిరీ సినిమా చూసినవాళ్లందరికీ బాగా తెలిసిందే. ఈ సినిమా విడుదలయినప్పట్లో ఈ డైలాగ్ ఫుల్ హల్ చల్ చేసింది. పైగా ఈ సినిమాలో షియాజీ షిండే తన సొంత వాయిస్ తో చెప్పడంతో దీనికి మరింత కలరింగ్ యాడ్ అయ్యింది. తాజాగా ఈ డైలాగ్ స్టైల్లోనే భారత క్రికెట్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఒక ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై పలు ప్రశంశలు కూడా లభిస్తున్నాయి మరి!!

న్యూజిలాండ్ తో మూడో వన్డేలో భారీ సెంచరీ చేసి టీమిండియాను గెలిపించిన విరాట్ కోహ్లీపై భారత క్రికెటర్లు - మాజీలు అభినందిస్తూ ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా కూడా తన స్టయిల్లో విరాట్ ను ప్రశంసిస్తూనే సరదా ట్వీట్లు చేశాడు. "చాంపియన్ విరాట్ కోహ్లీ రోజూ చేసే పనే ఇది!! నిద్ర లేవడం.. తినడం.. సెంచరీ చేయడం.. మళ్లీ పడుకోవడం.. ఇదే పని" అంటూ పోకీరీ స్టైల్ ట్వీట్ చేశాడు. అలాగే ఈమధ్య కాలంలో ఉగ్రశిభిరాలపై భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ని కూడా మేలవించి మరో ట్వీట్ చేశాడు జడేజా. "ఒక ఓవర్లో వరుసగా 4 - 2 - 4 - 6 - 2 - 4 పరుగులతో న్యూజిలాండ్ బౌలర్ ట్రెండ్ బౌల్ట్ పై కోహ్లీ సర్జికల్ దాడులు చేశాడు" అంటూ మరో ట్వీట్ చేశాడు.

ఇదే సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌... విరాట్ ఎందుకు స్పెషలో మరోసారి నిరూపించుకున్నాడని కితాబిచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాళ్లలో ఒకరిని చూశామని హర్ష భోగ్లే ట్వీట్ చేశాడు. ఇదే క్రమంలో భారత క్రికెటర్లు హర్భజన్ - మహ్మద్ కైఫ్ తో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు విరాట్ ఆటతీరును ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/