Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిలో ఆరాచ‌కం..మ‌రో నిర్భ‌య ఘ‌ట‌న‌!

By:  Tupaki Desk   |   25 April 2018 4:34 AM GMT
అమ‌రావ‌తిలో ఆరాచ‌కం..మ‌రో నిర్భ‌య ఘ‌ట‌న‌!
X
మాట‌ల్లో చెప్ప‌లేనంత ఆరాచ‌కం ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలో చోటు చేసుకుంది. సంచ‌ల‌నంగా మారిన ఈ ఉదంతం ఎంత ఆరాచ‌క‌మ‌న్న‌ది చూస్తే నోట మాట రాదంతే. దారుణ‌మైన అనారోగ్య స్థితిలో.. చావు బ‌తుకుల మ‌ధ్య పోరాడుతోంది. 17 ఏళ్ల యువ‌కుడు ఒక‌డు అత్యంత ఆరాచ‌కంగా అత్యాచారం చేయ‌ట‌మే కాదు.. బాధితురాలి జ‌న‌నాంగంలో క‌ర్ర‌తో తిప్పుతూ చేసిన చ‌ర్య నోట మాట రాకుండా చేస్తోంది. ఆల‌స్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతంలోకి వెళితే..

పిడుగురాళ్ల మండ‌లం జూల‌క‌ల్లుకు చెందిన 24 ఏళ్ల బాధితురాలి చిన్న‌త‌నంలో త‌ల్లిదండ్రులు చ‌నిపోయారు. దీంతో.. ఆమె అమ్మ‌మ్మ ద‌గ్గ‌రే పెరిగి పెద్ద‌దైంది. ఏడేళ్ల క్రితం కారంపూడి మండ‌లం ఒప్పిచ‌ర్ల‌కు చెందిన యువ‌కుడితో పెళ్లి జ‌రిగింది. అయితే.. మ‌రీ అమాయ‌కంగా ఉన్నావంటూ భ‌ర్త ఆమెను వ‌దిలేశాడు. దీంతో ఆమె ఒంట‌రైంది. భ‌ర్త‌.. కొడుకు మీద ఉన్న ఇష్టంతో వారికి ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండా పోయింది.

దీంతో ఆమెను ఒక గుంటూరులోని ఒక అనాథాశ్ర‌మంలో చేర్చారు. ఎనిమిది నెల‌లు అక్క‌డ ఉన్న ఆమె.. కొడుకు చూడ‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితిలో ఒప్పిచ‌ర్ల‌కు తిరిగి వ‌చ్చేసింది. ఒక ఇంటిని అద్దెకు తీసుకొని కూలీనాలీ ప‌నులు చేసుకుంటుంది.

ఇదిలా ఉండ‌గా.. ఆదివారం రాత్రి స్నానం చేసి.. బ‌ట్ట‌లు మార్చుకునే వేళ‌లో పొరుగునే నివ‌సించే షేక్ సైదులు అనే వ్య‌క్తి ఇంట్లోకి జొర‌బ‌డి.. ఆమె నోట్లో గుడ్డ‌లు కుక్కేసి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. తెల్ల‌వారుజాము వ‌ర‌కూ సాగిన లైంగిక దాడిలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. క‌ర్ర‌ను ఆమె జ‌న‌నాంగంలో తిప్ప‌టంతో పాటు.. మ‌రింత హింస‌కు పాల్ప‌డ్డాడు. ఎవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని బెదిరించి వెళ్లిపోయాడు. ర‌క్త‌సిక్త‌మైన బ‌ట్ట‌ల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమె.. త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని ఇరుగుపొరుగు వారితో చెప్ప‌టంతో ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని బాధితురాలి వ‌ద్ద వివ‌రాలు సేక‌రించారు. ప్ర‌స్తుతం చావుబ‌తుకుల మ‌ధ్య బాధితురాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.