Begin typing your search above and press return to search.

నువ్వొస్తావనీ...

By:  Tupaki Desk   |   29 July 2015 9:37 AM GMT
నువ్వొస్తావనీ...
X
వీరంతా ఎవరు...? ఎందుకిక్కడ కూర్చున్నారు..? వేలమంది ఒక్కచోట చేరి దేనికోసం నిరీక్షిస్తున్నారు.. ? రాజకీయ పార్టీల మీటింగు ఉందా.... ప్రభుత్వమేమైనా చెక్కులు పంచుతోందా..? లేదంటే సూపర్ స్టార్ కొత్త సినిమా మొదటి ఆటకు ఎవరైనా ఫ్రీగా టిక్కెట్లు ఇస్తున్నారా....?

.... అదేమీ కాదు.. వీరంతా రామేశ్వరం ప్రజలు. తమ ఊరి ముద్దుబిడ్డ, దేశానికి ముద్దుబిడ్డ అయిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతదేహం కోసం నిరీక్షిస్తున్నారు. ఎండను లెక్కచేయకుండా అంతా ఎదురుచూస్తున్నారు. ఊరికి పేరు తెస్తాడనుకుంటే దేశానికే పేరు తెచ్చిన మహనీయుడి చివరి చూపులకోసం నీళ్లు నిండిన కళ్లతో వారంతా కూర్చున్నారు.

కాగా కలాం అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరుకానున్నారు. రామేశ్వరంలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రభుత్వ లాంఛనాలతో కలాం అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరవుతున్నారు. ఒడిశా, మేఘాలయ, పలు ఇతర రాష్ట్రాల సీఎంలూ హాజరుకానున్నారు.