Begin typing your search above and press return to search.
ఆ ఇష్యూలో మోడీకి రజనీ ఫుల్ సపోర్ట్
By: Tupaki Desk | 22 Sep 2017 9:13 AM GMTదేశంలో చాలామంది ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. కానీ.. వ్యూహాత్మకంగా తనకు తప్పనిసరిగా మద్దతు ఇచ్చేలా చేసిన ప్రధానమంత్రి ఎవరూ లేరని చెప్పాలి. రాజకీయాలకు దూరంగా ఉన్నట్లుగా వ్యవహరించే పలు రంగాల వారిని సైతం తాను చేపట్టిన కార్యక్రమానికి మద్దతు ఇచ్చేలా చేసుకోవటంలో మోడీ సక్సెస్ అయ్యారు. తాను షురూ చేసిన స్వచ్ఛభారత్ కు తమ ఫుల్ సపోర్ట్ చేసేలా చేశారు.
చీపుర్లు పట్టుకొని వీధుల్లోకి వచ్చి పరిసరాల్ని శుభ్రం చేసుకోవాలంటూ ప్రముఖుల్ని బజార్లోకి తెచ్చిన ఘనత మోడీదే. తాను ప్రారంభించిన స్వచ్ఛ ప్రోగ్రాం కాస్త నెమ్మదించిందన్న భావన వచ్చినంతనే.. తన పేరిట పలువురు ప్రముఖులకు లేఖ రాయటం కనిపిస్తుంది. ప్రధానమంత్రే ఏకంగా తనను గుర్తిస్తూ లేఖ రాయటాన్ని ప్రముఖులు గుర్తించి.. మర్యాదపూర్వకంగా తమ మద్దతును ప్రకటించటం కనిపిస్తుంది.
విశాలంగా ఆలోచించే తత్త్వం తనలో టన్నులు టన్నులు ఉన్నట్లుగా కనిపించే మోడీ.. తన ప్రతి అడుగులోనూ తనదైన మార్క్ రాజకీయాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు. రాజకీయంగా తనను విభేదించే ఒకనాటి మిత్రుడు పవన్ కల్యాణ్ కు మాత్రం లేఖ రాయకుండా తన తీరును చెప్పకనే చెప్పేశారు.
అదే సమయంలో త్వరలో రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం సాగుతున్న తమిళ సూపర్ స్టార్ కు మోడీ లేఖ రాశారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రధాని మోడీ లాంటి పెద్ద మనిషి పని కట్టుకొని లేఖ రాస్తే రజనీ మాత్రం కామ్ గా ఉంటారా? అందుకే.. తన పూర్తి మద్దతును మోడీ షురూ చేసిన కార్యక్రమానికి ఇస్తున్నట్లుగా పేర్కొంటూ తాజాగా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఇచ్చినమ్మ వాయినం.. పుచ్చుకున్న వాయినం అన్నట్లుగా లేదు వీరి తీరు చూస్తే. తాను ప్రారంభించిన స్వచ్ఛ కార్యక్రమం మీడియాలో ప్రముఖంగా రావటం.. ప్రముఖులు అదే పనిగా తమ మద్దతును ప్రకటించటం.. ఈ విషయాలతో వార్తల మీద వార్తలు రావటం ద్వారా ఏదో జరిగిపోతున్న భ్రమను ప్రజలకు కలిగేలా చేయటం మూలంగానే కావొచ్చు.. దేశంలోని వీధులన్నీ చెత్తతో నిండిపోతున్నాయి. చిత్తశుద్ధి లేనప్పుడు చెత్త మాత్రం తన తీరు మార్చుకుంటుందా ఏంది?
చీపుర్లు పట్టుకొని వీధుల్లోకి వచ్చి పరిసరాల్ని శుభ్రం చేసుకోవాలంటూ ప్రముఖుల్ని బజార్లోకి తెచ్చిన ఘనత మోడీదే. తాను ప్రారంభించిన స్వచ్ఛ ప్రోగ్రాం కాస్త నెమ్మదించిందన్న భావన వచ్చినంతనే.. తన పేరిట పలువురు ప్రముఖులకు లేఖ రాయటం కనిపిస్తుంది. ప్రధానమంత్రే ఏకంగా తనను గుర్తిస్తూ లేఖ రాయటాన్ని ప్రముఖులు గుర్తించి.. మర్యాదపూర్వకంగా తమ మద్దతును ప్రకటించటం కనిపిస్తుంది.
విశాలంగా ఆలోచించే తత్త్వం తనలో టన్నులు టన్నులు ఉన్నట్లుగా కనిపించే మోడీ.. తన ప్రతి అడుగులోనూ తనదైన మార్క్ రాజకీయాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు. రాజకీయంగా తనను విభేదించే ఒకనాటి మిత్రుడు పవన్ కల్యాణ్ కు మాత్రం లేఖ రాయకుండా తన తీరును చెప్పకనే చెప్పేశారు.
అదే సమయంలో త్వరలో రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం సాగుతున్న తమిళ సూపర్ స్టార్ కు మోడీ లేఖ రాశారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రధాని మోడీ లాంటి పెద్ద మనిషి పని కట్టుకొని లేఖ రాస్తే రజనీ మాత్రం కామ్ గా ఉంటారా? అందుకే.. తన పూర్తి మద్దతును మోడీ షురూ చేసిన కార్యక్రమానికి ఇస్తున్నట్లుగా పేర్కొంటూ తాజాగా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఇచ్చినమ్మ వాయినం.. పుచ్చుకున్న వాయినం అన్నట్లుగా లేదు వీరి తీరు చూస్తే. తాను ప్రారంభించిన స్వచ్ఛ కార్యక్రమం మీడియాలో ప్రముఖంగా రావటం.. ప్రముఖులు అదే పనిగా తమ మద్దతును ప్రకటించటం.. ఈ విషయాలతో వార్తల మీద వార్తలు రావటం ద్వారా ఏదో జరిగిపోతున్న భ్రమను ప్రజలకు కలిగేలా చేయటం మూలంగానే కావొచ్చు.. దేశంలోని వీధులన్నీ చెత్తతో నిండిపోతున్నాయి. చిత్తశుద్ధి లేనప్పుడు చెత్త మాత్రం తన తీరు మార్చుకుంటుందా ఏంది?