Begin typing your search above and press return to search.
మోడీ మాటలే.. రాహుల్ కు పంచ్లు!
By: Tupaki Desk | 17 Oct 2018 7:55 AM GMTమధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా తొలుత జరిగే మధ్యప్రదేశ్ లో రాహుల్ తన ప్రచార జోరును పెంచారు. ప్రధాని మోడీ తీరును ఆయన కొత్త తరహాలో తిట్టిపోస్తున్నారు. మోడీ తీరును.. ఆయన శైలిలోనే వ్యంగ్య వ్యాఖ్యల ద్వారా విమర్శలు చేసి ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు.
తాజాగా మోరేనా లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్.. నరేంద్ర మోడీ గొంతును మిమిక్రీ చేసి.. ఆయన్ను అనుకరిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. మిత్రులారా.. నన్ను ప్రధానమంత్రి అని పిలవకండి.. వాచ్ మన్ అని పిలవండి అంటూ తియ్యగా మాట్లాడే మోడీని అదే రీతిలో అనుకరిస్తూ.. ప్రధాని ప్రజల్ని ఎలా మభ్యపెడతారో చెప్పే ప్రయత్నం చేశారు.
ప్రజల్ని స్నేహితులుగా పేర్కొనే మోడీ.. రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంతో ఆ బ్యాంక్ ను నిండా ముంచిన మెహుల్ చోక్సీ.. నీరవ్ మోడీలను సోదరులుగా వ్యవహరిస్తారని తప్పు పట్టారు. నవంబరు 28న మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు దఫాలుగా నాన్ స్టాప్ గా అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ.. విజయవంతంగా నాలుగో సారీ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంటే.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరాలన్న తపనతో కాంగ్రెస్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది.
తాజాగా మోరేనా లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్.. నరేంద్ర మోడీ గొంతును మిమిక్రీ చేసి.. ఆయన్ను అనుకరిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. మిత్రులారా.. నన్ను ప్రధానమంత్రి అని పిలవకండి.. వాచ్ మన్ అని పిలవండి అంటూ తియ్యగా మాట్లాడే మోడీని అదే రీతిలో అనుకరిస్తూ.. ప్రధాని ప్రజల్ని ఎలా మభ్యపెడతారో చెప్పే ప్రయత్నం చేశారు.
ప్రజల్ని స్నేహితులుగా పేర్కొనే మోడీ.. రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంతో ఆ బ్యాంక్ ను నిండా ముంచిన మెహుల్ చోక్సీ.. నీరవ్ మోడీలను సోదరులుగా వ్యవహరిస్తారని తప్పు పట్టారు. నవంబరు 28న మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు దఫాలుగా నాన్ స్టాప్ గా అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ.. విజయవంతంగా నాలుగో సారీ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంటే.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరాలన్న తపనతో కాంగ్రెస్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది.