Begin typing your search above and press return to search.
అవును..ఆయనను చంపింది బాబే:రఘువీరా
By: Tupaki Desk | 29 May 2017 8:28 AM GMTవిభజన నేపథ్యంలో ఛరిష్మాను కోల్పోయిన ఏపీ కాంగ్రెస్ నేతల్లో రఘువీరారెడ్డి ఒకరు. పదునైన వ్యాఖ్యలతో.. మంటపుట్టేలా మాట్లాడే తత్త్వం ఉన్న రఘువీరా నోరు విప్పితే వార్తగా మారేది. రాజకీయ ప్రత్యర్థులపై ఆయన విరుచుకుపడే తీరులో దూకుడెక్కువగా ఉంటుంది. విభజన కారణంగా ఏపీలో కాంగ్రెస్కు కాలం చెల్లటంతో ఆయన పార్టీ మాటల్ని.. ఆయన మాటల్ని వినే నాథుడే కరువయ్యారు.
తాజాగా రఘువీరా నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాంబు పేల్చినట్లుగా ఆయన భారీ ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును ఆయన అల్లుడే హత్య చేసినట్లుగా ఆరోపించారు. ఎన్టీఆర్ జయంతి తర్వాతి రోజున ఆయనీ తరహాలో వ్యాఖ్యలు చేయటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఓపక్క ఏపీ అధికారపక్షం తెలుగుదేశం పార్టీ విశాఖలో భారీ ఎత్తున మహానాడు నిర్వహించుకుంటున్న రఘువీరా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారన్నది ఆయన మాటల్లోనే చూస్తే.."ఎన్టీఆర్ హత్యకు గురై 21 ఏళ్లు అవుతోంది. ఆయన అల్లుడే ఆ పని చేశారు. అప్పట్లో ఔరంగజేబు పదవుల కోసం సొంతోళ్లను చంపేశాడు. చంద్రబాబు కూడా ఔరంగజేబు లాంటి వారే. ఎన్టీఆర్కు భారతరత్న విషయంలోనూ టీడీపీ ప్రజలను మోసం చేస్తోంది. మహానాడులో కేంద్రమంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఫైలు మోడీ టేబుల్ మీద ఉందని చెప్పటం పచ్చి అబద్ధం" అంటూ మండిపడ్డారు.
ఈ సందర్భంగా సుజనా మీద వ్యంగ్య విమర్శలు చేశారు. అసలు ప్రధాని ముందున్నది ఎన్టీఆర్ ఫైలా? చంద్రబాబుకు భారతరత్న ఇవ్వాలన్న ఫైలా? లేదంటే.. సుజనా బ్యాంకుల వ్యవహారం ఫైలా? ఇలా ఇంకా ఎంత కాలం ప్రజల్ని మోసం చేస్తారు? అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒక మహానేత మరణించిన రెండు దశాబ్దాల తర్వాత.. ఆయన మరణంపై ఇంత ఘాటు వ్యాఖ్యలు ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రఘువీరా బాంబులాంటి వ్యాఖ్యలకు ఏపీ తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
తాజాగా రఘువీరా నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాంబు పేల్చినట్లుగా ఆయన భారీ ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును ఆయన అల్లుడే హత్య చేసినట్లుగా ఆరోపించారు. ఎన్టీఆర్ జయంతి తర్వాతి రోజున ఆయనీ తరహాలో వ్యాఖ్యలు చేయటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఓపక్క ఏపీ అధికారపక్షం తెలుగుదేశం పార్టీ విశాఖలో భారీ ఎత్తున మహానాడు నిర్వహించుకుంటున్న రఘువీరా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారన్నది ఆయన మాటల్లోనే చూస్తే.."ఎన్టీఆర్ హత్యకు గురై 21 ఏళ్లు అవుతోంది. ఆయన అల్లుడే ఆ పని చేశారు. అప్పట్లో ఔరంగజేబు పదవుల కోసం సొంతోళ్లను చంపేశాడు. చంద్రబాబు కూడా ఔరంగజేబు లాంటి వారే. ఎన్టీఆర్కు భారతరత్న విషయంలోనూ టీడీపీ ప్రజలను మోసం చేస్తోంది. మహానాడులో కేంద్రమంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఫైలు మోడీ టేబుల్ మీద ఉందని చెప్పటం పచ్చి అబద్ధం" అంటూ మండిపడ్డారు.
ఈ సందర్భంగా సుజనా మీద వ్యంగ్య విమర్శలు చేశారు. అసలు ప్రధాని ముందున్నది ఎన్టీఆర్ ఫైలా? చంద్రబాబుకు భారతరత్న ఇవ్వాలన్న ఫైలా? లేదంటే.. సుజనా బ్యాంకుల వ్యవహారం ఫైలా? ఇలా ఇంకా ఎంత కాలం ప్రజల్ని మోసం చేస్తారు? అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒక మహానేత మరణించిన రెండు దశాబ్దాల తర్వాత.. ఆయన మరణంపై ఇంత ఘాటు వ్యాఖ్యలు ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రఘువీరా బాంబులాంటి వ్యాఖ్యలకు ఏపీ తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/