Begin typing your search above and press return to search.
బాబుపై నిర్భయ కేసు పెట్టాలంటున్న కాంగ్రెస్!
By: Tupaki Desk | 21 Feb 2017 11:40 AM GMTటీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై కాంగ్రెస్ పార్టీ నేతలు వరుస దాడులు మొదలుపెట్టినట్టే ఉన్నారు. నిన్నటి నుంచి విజయవాడలోనే మకాం వేసిన పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి... చంద్రబాబుపై నాన్ స్టాప్ దాడి మొదలుపెట్టారు. నిన్న సాయంత్రం చంద్రబాబును ఫ్యాక్షనిస్టుగా అభివర్ణించిన రఘువీరా... తాజాగా ఆయనను రేపిస్టుగానే తేల్చేశారు. అంతేకాదండోయ్... చంద్రబాబుపై నిర్భయ చట్టం కింద కేసు పెట్టాలని కూడా రఘువీరా డిమాండ్ చేశారు. నేటి మధ్యాహ్నం విజయవాడలో శాసనమండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్యతో కలిసి మీడియా ముందుకు వచ్చిన రఘువీరా... చంద్రబాబు - టీడీపీ నేతలు - ఇటీవల ముగిసిన మహిళా పార్లమెంటుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ పార్టీలోకి వెళ్తే తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని ఆరోపిస్తూ ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. ఏపీలో మాత్రం ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను సిగ్గు లేకుండా టీడీపీలోకి ఆహ్వానిస్తూ ప్రజాస్వామ్యాన్ని రేప్ చేస్తున్నారని రఘువీరా ధ్వజమెత్తారు. అందుకుగాను చంద్రబాబుపై నిర్భయ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ మహిళా పార్లమెంట్ నిర్వహణ కోసం రూ.కోట్లు ఖర్చు చేసి, షెడ్డులో ఉన్న కారుతో మహిళను పోలుస్తూ స్పీకర్ కోడెల శివప్రసాద్ గొప్ప సందేశం ఇస్తే సీఎం చంద్రబాబు దానిని సమర్థించడం శోచనీయమన్నారు.
ఈ ఆరోపణలు చూస్తుంటే... కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబుపై వరుస దాడికి తెర తీసినట్లుగానే కనిపిస్తోంది. ఇందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబును ఫ్యాక్షనిస్టుగా, రేపిస్టుగా అబివర్ణిస్తూ రఘువీరా తన మాటల తూటాలను పేల్చడం ప్రారంభించారన్న వాదన వినిపిస్తోంది. మరి ఈ మాటల తూటాలను చంద్రబాబు అండ్ కో ఏ రీతిన ఎదుర్కుంటుందో చూడాలి. ఓ పక్క వైసీపీ - మరో పక్క కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వరుస దాడులు చూస్తుంటే... టీడీపీకి కష్టకాలం మొదలైనట్టుగానే భావించక తప్పదేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ పార్టీలోకి వెళ్తే తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని ఆరోపిస్తూ ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. ఏపీలో మాత్రం ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను సిగ్గు లేకుండా టీడీపీలోకి ఆహ్వానిస్తూ ప్రజాస్వామ్యాన్ని రేప్ చేస్తున్నారని రఘువీరా ధ్వజమెత్తారు. అందుకుగాను చంద్రబాబుపై నిర్భయ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ మహిళా పార్లమెంట్ నిర్వహణ కోసం రూ.కోట్లు ఖర్చు చేసి, షెడ్డులో ఉన్న కారుతో మహిళను పోలుస్తూ స్పీకర్ కోడెల శివప్రసాద్ గొప్ప సందేశం ఇస్తే సీఎం చంద్రబాబు దానిని సమర్థించడం శోచనీయమన్నారు.
ఈ ఆరోపణలు చూస్తుంటే... కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబుపై వరుస దాడికి తెర తీసినట్లుగానే కనిపిస్తోంది. ఇందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబును ఫ్యాక్షనిస్టుగా, రేపిస్టుగా అబివర్ణిస్తూ రఘువీరా తన మాటల తూటాలను పేల్చడం ప్రారంభించారన్న వాదన వినిపిస్తోంది. మరి ఈ మాటల తూటాలను చంద్రబాబు అండ్ కో ఏ రీతిన ఎదుర్కుంటుందో చూడాలి. ఓ పక్క వైసీపీ - మరో పక్క కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వరుస దాడులు చూస్తుంటే... టీడీపీకి కష్టకాలం మొదలైనట్టుగానే భావించక తప్పదేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/