Begin typing your search above and press return to search.

టైం పాస్ కోసం బాబు ఏం చేస్తున్నారో తెలుసా?

By:  Tupaki Desk   |   1 Oct 2016 8:06 AM GMT
టైం పాస్ కోసం బాబు ఏం చేస్తున్నారో తెలుసా?
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై కొత్త విమ‌ర్శ వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు ఎన్‌ రఘువీరారెడ్డి తాజాగా చంద్ర‌బాబుపై పంచ్ వేశారు. కలెక్టర్లతో సమావేశాలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించేవ‌న్నీ టైంపాస్ కోస‌మేన‌ని మండిప‌డ్డారు. భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోకుండా ర్యాంకులు - గ్రేడ్‌ లు అంటూ త‌న ఉపోద్ఘాతాల‌తో గ‌డిపేస్తున్నార‌ని ఆక్రోషం వ్య‌క్తం చేశారు. ఒక‌వేళ చంద్ర‌బాబు చేస్తున్న స‌మీక్ష‌ల్లో నిజాయితి ఉంటే ఏపీ ఆర్థిక పరిస్థితి - పెట్టుబడులు - ఉద్యోగాలు - వృద్ధిపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ర‌ఘువీరా రెడ్డి డిమాండ్‌ చేశారు.

రైతుల పరామర్శ అంటూ సీఎం ఆకాశంలో చక్కర్లు కొడుతున్నారని ర‌ఘువీరారెడ్డి విమర్శించారు. రైతుల పంట నష్టం అంచ‌నా వేయాల్సిన కలెక్టర్లను - రెవెన్యూ అధికారులను క్షేత్రస్థాయిలో పర్యటించకుండా విజయవాడలో రెండు రోజులపాటు సమావేశం ఏర్పాటు చేసి సీఎం ఊకదంపుడు ప్రసంగాలు చేశార‌ని దుయ్యబట్టారు. సీఎంకు రైతులపై ఉన్న శ్రద్ధ ఏపాటిదో దీంతో అర్థమవుతోందని తెలిపారు. అధికారులు అనునిత్యం కనీసం నాలుగు నుంచి ఐదు సమీక్షలు, సమావేశాలు ఎదుర్కొనాల్సి వస్తోంద‌ని ర‌ఘువీరా పేర్కొన్నారు. ఇదంతా తానేదో చేస్తున్నాన‌ని చెప్పుకునేందుకు బాబు చేస్తున్న హైడ్రామా అని ర‌ఘువీరా మండిప‌డ్డారు. అధికారులు రాజ‌ధాని చుట్టూ - రివ్యూల చుట్టూ తిరిగేస్తుంటే ఇక అభివృద్ధి ఎలా సాధ్య‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కానీ అంకెల్లో మాత్రం వృద్ధి రేట్ల లెక్క‌ల‌ను పెంచేస్తున్నార‌ని ర‌ఘువీరా పేర్కొన్నారు. మాట‌ల‌తో కోట‌లు క‌ట్టే చంద్ర‌బాబు త‌న ప్ర‌వ‌ర్త‌న తీరు మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/