Begin typing your search above and press return to search.

మోడీ ఆశ్చ‌ర్య‌పోయేలా చేసిన జ‌గ‌న్ పార్టీ ఎంపీ!

By:  Tupaki Desk   |   27 Jun 2019 8:19 AM GMT
మోడీ ఆశ్చ‌ర్య‌పోయేలా చేసిన జ‌గ‌న్ పార్టీ ఎంపీ!
X
ప్ర‌ధాని మోడీ ఆశ్చ‌ర్య‌పోయేలా వ్య‌వ‌హ‌రించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఒక‌రు. ప్ర‌ధాని మోడీ మాత్ర‌మే కాదు.. ఆ ఎంపీ తీరుతో లోక్ స‌భ‌లోని స‌భ్యులంతా క్ష‌ణ‌కాలం స‌ర్ ప్రైజ్ అయ్యారు. గ‌డిచిన ఐదేళ్ల కాలంలోనే కాదు.. స‌మ‌కాలీన‌కాలంలో అలాంటివి తాము చూసింది లేద‌న్న మాట కొంద‌రు సీనియ‌ర్ ఎంపీల నోట వినిపిస్తోంది. ఇంత‌కీ.. అంతలా ఆశ్చ‌ర్య‌పోయేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఏం చేశారు? ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటే?

త‌న తీరుతో అంద‌రి దృష్టి త‌న మీద ప‌డేలా చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు. తాజాగా ఆయ‌న‌ లోక్ స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఒక ప్ర‌శ్న‌ను అడుగుతున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళుతున్నారు.

ఈ విష‌యాన్ని గుర్తించిన ర‌ఘురామ కృష్ణంరాజు ప్ర‌ధాని మోడీని పేరు పెట్టి పిలిచారు. తాను ప్ర‌శ్న అడిగే స‌మ‌యంలో ప్ర‌ధాని స‌భ‌లో ఉండాల‌న్న ఉద్దేశంతో.. మోడీజీ అంటూ చేతులు జోడించి పిలిచారు. ఊహించ‌ని ప‌రిణామంతో ఆశ్చ‌ర్య‌పోయిన మోడీ.. త‌ర్వాత ప‌ట్టించుకోకుండా లోక్ స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్లారు.

ఇదే స‌మ‌యంలో రైల్వే.. వాణిజ్య మంత్రి పీయూష్ గోయ‌ల్ తో స‌హా ప‌లువురు స‌భ్యులు ఆయ‌న వెళ్లిపోయారు.. మీరు ప్ర‌శ్న అడ‌గండన్నారు. దీంతో ర‌ఘురామ‌రాజు.. ఆయ‌న ఎటూ వెళ్లిపోయారుగా అంటూ త‌న ప్ర‌శ్న‌ను కేంద్ర‌మంత్రికి సంధించారు. మోడీని ఈ తీరులో ప్ర‌శ్నించిన ఎంపీ ర‌ఘ‌రామ కృష్ణంరాజేన‌ని చెబుతున్నారు.