Begin typing your search above and press return to search.
చంద్రబాబు ఓ మగ వగలాడి:పోసాని
By: Tupaki Desk | 11 Jun 2018 12:20 PM GMTటాలీవుడ్ విలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. చెప్పదలుచుకున్న విషయాన్ని ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం, లాజికల్ గా విమర్శలు గుప్పించడం పోసాని నైజం. తాను వైసీపీకి మద్దతుగా నిలుస్తానని, 2019లో జగన్ సీఎం అవుతారని పోసాని పలు సందర్భాల్లో బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే, తాను ఏ పార్టీ తరఫున ఎన్నికల్లో బరిలోకి దిగనని స్పష్టం చేశారు. తాజాగా, ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్ లో ఏపీ సీఎం చంద్రబాబుపై పోసాని నిప్పులు చెరిగారు. తాను చంద్రబాబు అనే ఓ మగ వగలాడి అక్రమాలు - అన్యాయాలు - కపట రాజకీయాల గురించి వెల్లడించేందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి....ఎన్టీఆర్ జీవితాన్ని లాక్కొని....నేడు సీఎం స్థాయికి ఎదిగిన చంద్రబాబును తిట్టేందుకు అసభ్యకరమైన పదాలు దొరికినపుడు మళ్లీ ప్రెస్ మీట్ పెడతానని షాకింగ్ కామెంట్స్ చేశారు. గొప్ప వ్యక్తి అయిన ఎన్టీఆర్ ను నాశనం చేసింది కాక జాతీయ మీడియాలో కూడా అన్నగారిని భ్రష్టుపట్టించిన ఘనత చంద్రబాబుదని మండిపడ్డారు.
పదవి కోసం రాజకీయంగా ఎవరి గొంతైనా కోసేందుకు చంద్రబాబు సిద్ధమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ దినపత్రికలో రాసిన కథనాన్ని ఉటంకిస్తూ ఆ చంద్రబాబు - లోకేష్ లపై నిప్పులు చెరిగారు. జగన్ ఆస్తులను ఇంకా వేలం వేయరేం.....ఇతర కేసుల మాదిరిగా జగన్ కేసుల విచారణ జరగనీయకుండా ఎవరు అడ్డుకుంటున్నారు...అని ప్రచురించారని ఆ కథనాన్ని ఉటంకించారు. సిగ్గు లేకుండా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడమే చంద్రబాబు చేసిన అభివృద్ధా అంటూ ఆ పత్రికలో ఓ కథనాన్ని స్వయంగా రాసిన పత్రికాధినేతను సూటిగా ప్రశ్నించారు. వైసీపీకి వేస్తే బీజేపీకి వేసినట్లేనని లోకేష్ బాబు అన్నారని.....చంద్రబాబుకు ఓటేస్తే కమ్మ కులానికి - రాజ్యానికి - కమ్మ ఏకచ్ఛత్రాధిపత్యానికి ఓటేసినట్లేనని తాను అంటున్నానని ఆ కథనాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలకు ముందు జగన్ పై లేనిపోని ఆరోపణలు చేసినట్లుగానే....మళ్ళీ ఈ ఎన్నికలకు ముందు కూడా విష ప్రచారం చేసేందుకే ఈ తరహా కథనాలను వండి వారుస్తున్నారని నిప్పులు చెరిగారు.
ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన చంద్రబాబు ...కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కాళ్లు పట్టుకొని విజయవాడకు పారిపోయాడని ఎద్దేవా చేశారు. నైతిక విలువలు పాటించని ఏకైక నాయకుడు చంద్రబాబని పోసాని అన్నారు. ఇపుడు మళ్లీ ఓటుకు నోటు కేసు తెరపైకి రావడంతో....ఇపుడు కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నాడని మండిపడ్డారు. 1999లో వాజ్ పేయితో చేతులకు కలిపిన చంద్రబాబు...ముస్లింలను, కమ్యూనిస్టులను విస్మరించారని మండిపడ్డారు. బీజేపీతో కలిసి చారిత్రక తప్పిదం చేశానని 2004లో చంద్రబాబు ముస్లింలతో, కమ్యూనిస్టులతో అన్నారని, కానీ సిగ్గు లేకుండా 2014లో మళ్లీ మోదీతో జతకట్టారని నిప్పులు చెరిగారు. మోదీతో అంటకాగి ఏపీ ప్రత్యేక హోదాను ప్యాకేజీకి తాకట్టు పెట్టిన చంద్రబాబు...ఇపుడు యూటర్న్ తీసుకొని మళ్లీ హోదా కావాలంటూ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలంతా చంద్రబాబు నాటకాలను గమనించాలని, ఎవ్వరినైనా నమ్మించి మోసం చేయగల నైజం ఉన్న అటువంటి వ్యక్తిని నమ్మి ఓటు వేయవద్దని పోసాని పిలుపునిచ్చారు.
పదవి కోసం రాజకీయంగా ఎవరి గొంతైనా కోసేందుకు చంద్రబాబు సిద్ధమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ దినపత్రికలో రాసిన కథనాన్ని ఉటంకిస్తూ ఆ చంద్రబాబు - లోకేష్ లపై నిప్పులు చెరిగారు. జగన్ ఆస్తులను ఇంకా వేలం వేయరేం.....ఇతర కేసుల మాదిరిగా జగన్ కేసుల విచారణ జరగనీయకుండా ఎవరు అడ్డుకుంటున్నారు...అని ప్రచురించారని ఆ కథనాన్ని ఉటంకించారు. సిగ్గు లేకుండా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడమే చంద్రబాబు చేసిన అభివృద్ధా అంటూ ఆ పత్రికలో ఓ కథనాన్ని స్వయంగా రాసిన పత్రికాధినేతను సూటిగా ప్రశ్నించారు. వైసీపీకి వేస్తే బీజేపీకి వేసినట్లేనని లోకేష్ బాబు అన్నారని.....చంద్రబాబుకు ఓటేస్తే కమ్మ కులానికి - రాజ్యానికి - కమ్మ ఏకచ్ఛత్రాధిపత్యానికి ఓటేసినట్లేనని తాను అంటున్నానని ఆ కథనాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలకు ముందు జగన్ పై లేనిపోని ఆరోపణలు చేసినట్లుగానే....మళ్ళీ ఈ ఎన్నికలకు ముందు కూడా విష ప్రచారం చేసేందుకే ఈ తరహా కథనాలను వండి వారుస్తున్నారని నిప్పులు చెరిగారు.
ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన చంద్రబాబు ...కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కాళ్లు పట్టుకొని విజయవాడకు పారిపోయాడని ఎద్దేవా చేశారు. నైతిక విలువలు పాటించని ఏకైక నాయకుడు చంద్రబాబని పోసాని అన్నారు. ఇపుడు మళ్లీ ఓటుకు నోటు కేసు తెరపైకి రావడంతో....ఇపుడు కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నాడని మండిపడ్డారు. 1999లో వాజ్ పేయితో చేతులకు కలిపిన చంద్రబాబు...ముస్లింలను, కమ్యూనిస్టులను విస్మరించారని మండిపడ్డారు. బీజేపీతో కలిసి చారిత్రక తప్పిదం చేశానని 2004లో చంద్రబాబు ముస్లింలతో, కమ్యూనిస్టులతో అన్నారని, కానీ సిగ్గు లేకుండా 2014లో మళ్లీ మోదీతో జతకట్టారని నిప్పులు చెరిగారు. మోదీతో అంటకాగి ఏపీ ప్రత్యేక హోదాను ప్యాకేజీకి తాకట్టు పెట్టిన చంద్రబాబు...ఇపుడు యూటర్న్ తీసుకొని మళ్లీ హోదా కావాలంటూ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలంతా చంద్రబాబు నాటకాలను గమనించాలని, ఎవ్వరినైనా నమ్మించి మోసం చేయగల నైజం ఉన్న అటువంటి వ్యక్తిని నమ్మి ఓటు వేయవద్దని పోసాని పిలుపునిచ్చారు.