Begin typing your search above and press return to search.

తేజ‌స్విని సీన్లోకి వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   27 Jun 2017 7:36 AM GMT
తేజ‌స్విని సీన్లోకి వ‌చ్చేసింది
X
బ్యూటీషియ‌న్ శిరీష డెత్ మిస్ట‌రీకి సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మొద‌ట్నించి వినిపిస్తున్న తేజ‌స్వినీని పోలీసులు ప‌ట్టించుకోవ‌టం లేద‌ని.. ఆమెను విచారించ‌టం లేదంటూ శిరీష బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా తేజ‌స్విని పోలీసులు విచారించిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన స‌మాచారం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. తేజ‌స్వినిని పోలీసులు విచారించిన‌ట్లుగా చెబుతున్నారు. తాను రాజీవ్‌ ను ప్రేమించాన‌ని.. అత‌డి కోస‌మే బెంగ‌ళూరు నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన‌ట్లుగా ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. అత‌న్ని పెళ్లి చేసుకోవాల‌ని తాను అనుకున్న‌ట్లు ఆమె చెప్పార‌ట‌.

అయితే.. రాజీవ్ ఉదంతంపై సందేహాలు వ‌చ్చి తాను విజ‌య‌వాడ వెళ్లిన‌ట్లుగా తేజ‌స్విని చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. విజ‌య‌వాడ‌లోని రాజీవ్ త‌ల్లిని తాను క‌లిశాన‌ని.. ఆమె త‌నతో పెళ్లికి ఒప్పుకోలేద‌ని చెప్పినట్లుగా స‌మాచారం. త‌న‌కు.. శిరీష‌కు సంబంధం లేద‌ని.. ఆమె చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. రాజీవ్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని.. ఈ నేప‌థ్యంలోనే తాను గ‌తంలో బంజారహిల్స్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేసిన‌ట్లుగా ఆమె పోలీసుల‌కు వెల్ల‌డించారు. రాజీవ్ త‌న‌ను మోసం చేశార‌న్న భావ‌న మాత్ర‌మే ఉంద‌ని.. మిగిలిన దాంతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ఆమె చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/