Begin typing your search above and press return to search.
32/9.. పవన్ బరిలో నిలిచే తొలి జాబితా
By: Tupaki Desk | 11 March 2019 4:00 PM ISTదేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. ఏపీలో తొలివిడతలోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసిపోతోంది. నెలరోజుల గడువు ఉండడంతో ఏపీలో అధికార , ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిజిబిజిగా ఉన్నాయి.
తాజాగా టీడీపీ తొలి జాబితాను ఖరారు చేసి అందరికంటే ముందంజలో ఉంది. ఇక ప్రతిపక్ష పార్టీ కూడా దాదాపు కొలిక్కి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలో మూడో ప్రధాన పార్టీ అయిన జనసేన తాజాగా అభ్యర్థులు, పోటీపై స్పష్టతనిచ్చింది.
పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్ ద్వారా జనసేన పోటీపై క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 32అసెంబ్లీ, 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారంటూ పవన్ ట్వీట్ చేశారు. జనసేన జనరల్ బాడీ ఈ మేరకు అభ్యర్థులను ఖరారు చేసిందని తెలిపారు. తొలిజాబితా ఓకే అయ్యిందని.. మలి జాబితా ఉంటుందని పవన్ ట్వీట్ ద్వారా అర్థమైంది.
తాజాగా టీడీపీ తొలి జాబితాను ఖరారు చేసి అందరికంటే ముందంజలో ఉంది. ఇక ప్రతిపక్ష పార్టీ కూడా దాదాపు కొలిక్కి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలో మూడో ప్రధాన పార్టీ అయిన జనసేన తాజాగా అభ్యర్థులు, పోటీపై స్పష్టతనిచ్చింది.
పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్ ద్వారా జనసేన పోటీపై క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 32అసెంబ్లీ, 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారంటూ పవన్ ట్వీట్ చేశారు. జనసేన జనరల్ బాడీ ఈ మేరకు అభ్యర్థులను ఖరారు చేసిందని తెలిపారు. తొలిజాబితా ఓకే అయ్యిందని.. మలి జాబితా ఉంటుందని పవన్ ట్వీట్ ద్వారా అర్థమైంది.
