Begin typing your search above and press return to search.

పాక్‌ కళాకారులను బూట్లతో కొట్టాల్సిందే!

By:  Tupaki Desk   |   27 Sep 2016 4:38 AM GMT
పాక్‌ కళాకారులను బూట్లతో కొట్టాల్సిందే!
X
ఉరి ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ - భారత్ మధ్య సంబందాలు రోజురోజుకీ బలహీనపడిపోతున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో పాకిస్థాన్ కు చెందిన సినీ - టీవీ నటులు రెండు రోజుల్లోపు (48 గంటల్లో) దేశం విడిచి వెళ్లిపోవాలి, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అల్టిమేటం జారీచేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో పాకిస్థాన్ నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులను భారత్ బహిష్కరించాలని - అన్ని షాపింగ్స్ మాల్స్ - దుకాణాల్లోనూ పాకిస్థాన్ ఉత్పత్తులేమీ అమ్మరాదని బాంబే యూత్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ హడావిడి మధ్యలో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఏకంగా భారత్ లో ఉన్న పాకిస్థాన్ నటీనటులను - కళకారులను బూట్లతో కొట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు.

వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన యూపీకి చెందిన భాజపా ఎమ్మెల్యే సంగీత్ సోమ్‌.. ఉరీ ఉగ్ర ఘాతుకం నేపథ్యంలో బాలీవుడ్ లో ఉన్న పాక్ కళాకారులపై విమర్శలు చేశారు. భారత్‌ లో ఉంటూ కోట్లాదిరూపాయలు సంపాదిస్తున్న కళాకారులు కొందరున్నారు.. వారిని పాకిస్థాన్‌ లో ఎవరూ పట్టించుకోరు.. కానీ బాలీవుడ్‌ కు వచ్చి మాత్రం కోట్లాదిరూపాయలు సంపాదించుకుంటున్నారు.. ఆ తర్వాత భారత్‌ ను వంచిస్తారు.. వారిని బూట్లతో కొట్టాల్సిందే అని సోమ్‌ అన్నారు.

కాగా... పాకిస్థాన్ కు చెందిన సినీ - టీవీ నటులు రెండు రోజుల్లోపు దేశం విడిచి వెళ్లిపోవాలని - లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఎంఎన్ ఎస్ అల్టిమేటం జారీ చేసి ఇప్పటికే 48 గంటలు దాటిపోయింది. దీనిపై మహారాష్ట్ర పోలీసులు నాడే స్పందించారు. భారత ప్రభుత్వం అనుమతితో వచ్చిన పాక్ సహా విదేశాలకు చెందిన నటీనటులందరికీ రక్షణ కల్పిస్తామని - ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/