Begin typing your search above and press return to search.

గాంధీ కంటే అంబేడ్కర్ గొప్ప.. ఒవైసీ సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   20 Jan 2019 4:52 AM GMT
గాంధీ కంటే అంబేడ్కర్ గొప్ప.. ఒవైసీ సంచలన ప్రకటన
X
తన వ్యాఖ్యలతో నిత్యం ఏదో ఒక సంచలనం సృష్టించడం ఒవైసీకి అలవాటు. ఈసారి కూడా ఈ మజ్లిస్ నాయకుడు అలాంటి వ్యాఖ్యలే చేశారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో తెలంగాణ జాగృతి ఏర్పాటుచేసిన అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సులో పాల్గొన్న ఒవైసీ.. రాజకీయాల్లోకి యువత రావాలని అంబేడ్కర్ ఎక్కువగా ఆకాంక్షించారని, అందుకే తన దృష్టిలో గాంధీ కంటే అంబేడ్కరే గొప్ప అని అన్నారు.

తను ఏం మాట్లాడినా అందులో వివాదాలు వెదుకుతారని, కానీ యువతలో స్ఫూర్తి నింపేందుకు, నలుగుర్ని ఆలోచింపజేసేందుకే తను అలా మాట్లాడతానని ఒవైసీ స్పష్టంచేశారు. వివాదాస్పద కశ్మీర్ అంశంపై కూడా అసదుద్దీస్ స్పందించారు.

కశ్మీర్ ఎప్పుడూ భారత్ లో అంతర్భాగమేనని, కశ్మీర్ ప్రజలు, యువత కూడా భారత ప్రజలేనని అన్నారు ఒవైసీ. రాజకీయాల్లో యువత ప్రాతినిధ్యం పెంచేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీల కనీస పోటీ వయసును 20 ఏళ్లకు తగ్గించాలని ఒవైసీ డిమాండ్ చేశారు.