Begin typing your search above and press return to search.

మోడీకి ఊహించ‌ని మ‌ద్ద‌తు

By:  Tupaki Desk   |   29 Nov 2015 9:45 AM GMT
మోడీకి ఊహించ‌ని మ‌ద్ద‌తు
X
జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం...దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో ఉన్న ఈ విశ్వ‌విద్యాల‌యంలో పూర్తి చ‌దువుకుంటున్న‌ది ముస్లింలే అయినప్ప‌టికీ వారంతా తీవ్రమైన ముస్లిం అభిమానులు అనే పేరుంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న వ‌ర్సిటీ స్నాతకోత్సవానికి రావాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీని జామియా మిలియా ఇస్లామియా మీడియా కో-ఆర్డినేటర్‌ ముఖేష్‌ రంజన్ ఆహ్వానించారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

న‌రేంద్ర‌ మోడీ గతంలో జామియా మిలియా యూనివ‌ర్సిటీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, అందువల్ల ఆయనను ఆహ్వానించవద్దని వైస్‌ ఛాన్సెలర్‌ కు విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు కొందరు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో ముఖేష్‌ రంజన్‌ మాట్లాడుతూ స్నాతకోత్సవానికి మోడీని ఆహ్వానించడం పట్ల నిరసన వ్యక్తమైనట్లు తమ దృష్టికి రాలేదన్నారు. నరేంద్రమోడీని మన ప్రధాని అని పేర్కొంటూ ఆయనను ప్రజలు ఎన్నుకున్నారని చెప్పారు. ప్రధాని మోడీ పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదని రంజ‌న్ స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం అధికారులు మోడీకి ఆహ్వానాన్ని పంపించారు. కాగా ఇంతవరకూ ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయంలో ఎలాంటి సమాచారం వ‌ర్సిటీకి పంపలేదు. డిసెంబ‌రు రెండో వారంలో స్నాత‌కోత్స‌వం జ‌ర‌గ‌నుంది.