Begin typing your search above and press return to search.

కేసీఆర్ కొత్త‌ టీం లో మంత్రులు వీరే

By:  Tupaki Desk   |   12 Dec 2018 10:05 AM GMT
కేసీఆర్ కొత్త‌ టీం లో మంత్రులు వీరే
X
రాజకీయ ఎత్తుగడలను సరిగ్గా అంచనా వేస్తు శాసనసభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయదుందుభి మోగించిన తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత పార్టీ మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సమయత్తమవుతున్నారు. ప్ర‌స్తుత అప‌ద్ధ‌ర్మ సీఎం కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిసెంబర్ 11న ఫలితాల అనంతరం గవర్నర్ నరసింహన్‌ను కలిసి సీఎం కేసీఆర్ తన ప్రమాణస్వీకారం సమాచారాన్ని అందజేశారు. మ‌రో వైపు టీఆర్ఎస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఆయ‌న ఎంపిక లాంచ‌న‌ప్రాయ‌మే అయినప్ప‌టికీ... అది కూడా పూర్త‌యింది! పార్టీ ప‌రంగా స‌మ‌చారం ఇవ్వ‌డం... గ‌వ‌ర్న‌ర్ ప్ర‌క‌ట‌న వెలువ‌రించ‌డం ఒక్క‌టే ఆల‌స్యం!

ఇదిలా ఉండ‌గా, త‌న కొత్త మంత్రివర్గ కూర్పు పై కేసీఆర్ కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్నవారిలోనూ కొందర్ని మారుస్తారంటూ వార్తలు వస్తున్నారు. ఇక, మంత్రివర్గం లో కొత్తగా చేరేవారు వీరేనంటూ ప్రచారం సాగుతోంది. వివిధ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం కొప్పుల ఈశ్వర్‌ (ధర్మపురి)- బాల్క సుమన్‌ (చెన్నూరు)- నోముల నర్సింహయ్య (నాగార్జునసాగర్‌)- సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (వనపర్తి)- దాస్యం వినయ్‌భాస్కర్‌ (వరంగల్‌ తూర్పు)- శ్రీనివాస్‌గౌడ్‌ (మహబూబ్‌నగర్‌)- రేఖానాయక్‌ (ఖానాపూర్‌)- పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్‌)- ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి)- వేముల ప్రశాంత్‌రెడ్డి (బాల్కొండ)- మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి) పేర్లు కేసీఆర్ కొత్త టీం లో ఉండ‌నున్నాయి.

ప్రస్తుత స్పీకర్ మధుసూదనాచారి ఓడిపోవడంతో ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని సభాపతిగా నియమించనున్నారు. భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంటకరమణారెడ్డి చేతిలో స్పీకర్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇప్పటికే కొత్త స్పీకర్ ఎంపిక పై సీఎం దృష్టి సారించారు. ఈ పదవికి ప్రస్తుత ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు రెడ్యానాయక్‌- ఈటల రాజేందర్‌ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా, మరోవైపు నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కి కూడా మంత్రివర్గంలో చోటుదక్కుతుందనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. అయితే దీని పై పూర్తి స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.