Begin typing your search above and press return to search.
అంబానీ అండ్ కోలకు మోడీ మార్క్ షాక్
By: Tupaki Desk | 2 Sep 2015 9:18 AM GMTమోడీ మార్క్ నిర్ణయం మరొకటి తీసేసుకోవటం జరిగింది. గతంలో బొగ్గు గనుల మీద గుత్తాధిపత్యాన్ని బద్ధలుకొట్టేసి.. వేలం పాటలు నిర్వహించే విధానాన్ని పోలినట్లే తాజా నిర్ణయం పోలి ఉండటం గమనార్హం. అత్యంత కీలకమైన చమురు క్షేత్రాలకు సంబంధించిన అజమాయిషీ హక్కుల్ని వేలంపాట ద్వారానే కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. దీంతో.. చమురుక్షేత్రాలపై రిలయన్స్ అంబానీలు.. లాంటి అతి కొద్దిమందికి మాత్రమే ఉండే గుత్తాధిపత్యాన్ని తాజా వేలంపాటతో మంగళం పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. చమురు క్షేత్రాలను కట్టబెట్టే విషయంలో గతంలో అనుసరించిన విధానాలకు భిన్నంగా బహిరంగంగా వేలంపాట ద్వారానే కట్టబెట్టాలని తీసుకున్న తాజా నిర్ణయం ఈ రంగంలోని పలువురు అధిపత్యాన్ని సవాలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
గతంలో చమురు క్షేత్రాలకు సంబంధించి కేంద్రమంత్రుల స్థాయి వారు జోక్యం చేసుకొని.. విధివిధానాల్లో మార్పులు చేయాలని ప్రయత్నిస్తే.. వారి పదవులు పోయే పరిస్థితి. అంతటి శక్తివంతమైన చమురు లాబీలకు దెబ్బ పడేలా మోడీ నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. తాజాగా ప్రకటించిన చమురుక్షేత్రాల వేలం నిర్ణయం ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. ఈ నిర్ణయం రిలయన్స్ అంబానీ..తదితరులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్న మాట మార్కెట్ వర్గాల్లో వినిపిస్తోంది.
గతంలో చమురు క్షేత్రాలకు సంబంధించి కేంద్రమంత్రుల స్థాయి వారు జోక్యం చేసుకొని.. విధివిధానాల్లో మార్పులు చేయాలని ప్రయత్నిస్తే.. వారి పదవులు పోయే పరిస్థితి. అంతటి శక్తివంతమైన చమురు లాబీలకు దెబ్బ పడేలా మోడీ నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. తాజాగా ప్రకటించిన చమురుక్షేత్రాల వేలం నిర్ణయం ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. ఈ నిర్ణయం రిలయన్స్ అంబానీ..తదితరులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్న మాట మార్కెట్ వర్గాల్లో వినిపిస్తోంది.