Begin typing your search above and press return to search.

ఓవైసీ దిష్టిబొమ్మ ద‌గ్దం చేసిన ముస్లింలు!

By:  Tupaki Desk   |   18 March 2017 9:56 AM GMT
ఓవైసీ దిష్టిబొమ్మ ద‌గ్దం చేసిన ముస్లింలు!
X
హైద‌రాబాద్ ఎంపీ,ఎంఐఎం నేత అస‌దుద్దిన్ ఓవైసీపై ముస్లింలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న దిష్టిబొమ్మ‌ను త‌యారుచేయ‌డ‌మే కాకుండా దానిపై చెప్పుతో దాడి కూడా చేశారు. అంతేకాదు ఓవైసీ దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేసి త‌మ ఆగ్ర‌హాన్ని చాటుకున్నారు. మ‌హారాష్ట్ర‌లోని నాందేడ్‌ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇటీవ‌ల జ‌రిగిన ఉత్త‌రప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ముస్లిం ఓట్లు చీలిపోవ‌డానికి కార‌ణం ఓవైసీ అంటూ ఆందోళ‌న నిర్వ‌హించారు. ముస్లిం ఓట్లు చీలిపోవ‌డం వ‌ల్ల బీజేపీకి లాభ‌మైంద‌ని నిర‌స‌న‌కారులు ఆరోపించారు. ఓవైసీ ముర‌దాబాద్ అంటూ నినాదాలు చేశారు.

కాగా, దేశ‌వ్యాప్తంగా విస్త‌రించాల‌ని అనుకున్న ఎంఐఎం ఇందులో భాగంగా ఉత్త‌ర‌ప్రదేశ్ ఎన్నిక‌ల్లో పోటీ చేసింది. ఈ ఎన్నిక‌ల్లో ఎంఐఎంకు విజ‌యం ఖాయ‌మ‌ని ఓవైసీ బ్ర‌ద‌ర్స్ ధీమా వ్య‌క్తం చేశారు. అయితే ఎంఐఎం ఘోర ప‌రాజ‌యం పాలయింది. ఎంఐఎం ఆశించిన స్థాయిలో ముస్లింల ఓట్లు కూడా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌డ‌లేదు. అదే స‌మ‌యంలో ముస్లింల‌కు ఒక్క టికెట్ కూడా ఇవ్వ‌న‌ప్ప‌టికీ మైనార్టీలు పెద్ద ఎత్తున బీజేపీకి మ‌ద్ద‌తిచ్చారు. ఈ ప‌రిణామం ఎంఐఎం వ‌ర్గాల‌ను సైతం నిర్ఘాంత‌ప‌రిచింది. కాగా ట్రిపుల్ త‌లాక్‌ కు మ‌ద్ద‌తివ్వ‌డం ద్వారా మ‌హిళల మ‌న‌సుల‌ను బీజేపీ దోచుకుంద‌ని అందులో భాగంగానే ఈ స్థాయిలో ఓట్లు ప‌డ్డాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/