Begin typing your search above and press return to search.

ముద్దులొలికే పిల్లల్ని ఆ అమ్మ చంపిందెందుకు?

By:  Tupaki Desk   |   10 Oct 2015 7:16 AM GMT
ముద్దులొలికే పిల్లల్ని ఆ అమ్మ చంపిందెందుకు?
X
ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు ఎంత అనాలోచితంగా ఉంటాయో తాజా ఘటన చూస్తే తెలుస్తుంది. అల్లారు ముద్దుగా పెంచుకునే పిల్లాల్ని.. నిరాశ.. నిస్పృహలతో తీసుకునే దారుణ నిర్ణయాలకు అమాయకులైన పిల్లలు బలయ్యే పరిస్థితి. భర్త తాగుడుకి బానిస అయ్యాడన్న కారణంతో ముద్దులొలికే ఇద్దరు చిన్నారుల్ని చంపేసి.. తాను చనిపోవాలని అనుకుందో మహిళ. తమిళనాడులోని చెన్నై కీల్పాకంకు చెందిన ఈ ఉదంతం పెను సంచలనం సృష్టించింది.

కీల్పకానికి చెందిన కాంట్రాక్టర్ గా పని చేస్తున్న సంతోష్ కు భార్య మమత (34).. కుమార్తె యాసి (12).. కుమారుడు అనుష్ (7) ఉన్నారు. ఆనందంగా.. ఆహ్లాదంగా సాగే వారి ఫ్యామిలీలో ఉన్నట్లుండి ‘లిక్కర్’ రంగ ప్రవేశం చేసింది. ఇటీవల కాలంలో మద్యం సేవిస్తున్న సంతోష్.. బాగా ఎక్కువగా తాగటం ఆ ఇంట్లో గొడవలకు కారణమైంది.

మద్యం మత్తులో వచ్చిన సంతోష్ తో పెద్దగా గొడవ పెట్టుకున్న మమత.. ఇదే విధంగా తాగితే పిల్లల్ని చంపేసి.. తాను చచ్చిపోతానని బెదిరించింది. అయినా.. అతగాడిలో మార్పు రాకపోవటంతో.. నిరాశకు గురైన ఆమె మనో వేదనతో ఉన్మాదిగా మారింది. స్కూల్ నుంచి వచ్చిన 12 ఏళ్లకుమార్తె యశిని బెడ్ రూంలోకి తీసుకెళ్లి.. పావడాతో ఉరి బిగించి చంపేసింది. అనంతరం.. ఏడేళ్ల అనుష్ స్కూలు నుంచి వచ్చిన తర్వాత అతన్ని చంపేసిన మమత.. షుగర్ పేషెంట్లు వాడే మందుబిళ్లల్ని భారీగా వేసుకొని.. తన సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పి ఫోన్ కట్ చేసింది. దీంతో హుటాహుటిన ఇంటికి చేరిన బంధువులకు.. విగతజీవులుగా మారిన పిల్లలు.. స్పృహ కోల్పోయిన మమత కనిపించారు.

పిల్లలు చనిపోగా.. మమత ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. భర్త చేసిన తప్పులకు మనోవేదనతోభార్య మరింత పెద్ద తప్పు చేసి.. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల ప్రాణాలు తీయటం పలువురిని కదిలించివేసింది.