Begin typing your search above and press return to search.

మెడీ కేబినెట్‌ లో ఈ ముగ్గురిదే పైచేయి అట‌

By:  Tupaki Desk   |   13 Sep 2017 11:30 PM GMT
మెడీ కేబినెట్‌ లో ఈ ముగ్గురిదే పైచేయి అట‌
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఇటీవ‌ల చేసిన‌ కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనంతరం ఆ కూర్పుపై కొత్త చ‌ర్చ మొద‌లైంది. ప్రస్తుత కేబినెట్‌ లో ఆ ముగ్గురి ప్రభ వెలుగుతోంది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ - రైల్వే మంత్రి పీయూష్ గోయల్ - పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లకు భద్రత - ఆర్థిక - రాజకీయ, - పార్లమెంటరీ కేబినెట్ కమిటీల్లో బాధ్యతలు కల్పించటంతో కొత్త కేబినెట్‌ లో ముగ్గురి ప్రాధాన్యం పెరిగిందని అంటున్నారు. ఈ ముగ్గురు మంత్రులే కొత్త వారిలో స‌ర్వ‌స్వం అని అంటున్నారు.

ప్రధాని మోడీ నేతృత్వంలోని కేబినెట్ భద్రతా కమిటీలో సీతారామన్ రక్షణ మంత్రి హోదాలో ఇప్పుడు సభ్యురాలు. గత మార్చిలో మనోహర్ పారికర్ కేబినెట్ నుంచి బయటకు వచ్చిన తరువాత, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆ శాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు సీతారామన్ రక్షణ శాఖను స్వీకరించటంతో కేబినెట్ భద్రతా కమిటీలో స్థానం దక్కింది. హోంమంత్రి రాజ్‌ నాథ్ సింగ్ - ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ - విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ - పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పురి మిగిలిన సభ్యులుగా ఉన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ నుంచి మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్విని తప్పించారు. కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందు వరకూ ఆయన పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా కొనసాగారు. తాజాగా కేబినెట్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి విజయ్ గోయల్‌ కు స్థానం దక్కింది. ఆర్థిక, రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీలోనూ సీతారామన్ - విజయ్ గోయల్‌ కు స్థానం కల్పించడంతో కేబినెట్‌ లో వారి ప్రాధాన్యత పెరిగినట్టయింది.