Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: పీఎం ని హగ్ చేసుకున్నాడే!

By:  Tupaki Desk   |   11 Jan 2019 6:51 AM GMT
ఫోటో స్టొరీ: పీఎం ని హగ్ చేసుకున్నాడే!
X
ఈ మధ్యే కొంతమంది బాలీవుడ్ ప్రముఖుల టీమ్ ప్రధాని నరేంద్ర మోదిని కలిసి 'మెరుగైన సమాజం' కోసం భారత దేశ అభ్యున్నతి కోసం సినిమా ఇండస్ట్రీ వారు ఏం చేయగలరు.. ఏం చేయాలి అన్న విషయాలు చర్చించారు. ఈ బృందానికి ఫిలిం మేకర్ కరణ్ జోహార్ నాయకత్వం వహించగా రణబీర్ కపూర్.. వరుణ్ ధావన్.. సిద్దార్థ్ మల్హోత్రా.. ఆయుష్మాన్ ఖురానా.. రాజ్ కుమార్ రావు.. రోహిత్ శెట్టి.. ఏకతా కపూర్..అలియా భట్.. భూమి పెడ్నేకర్.. విక్కీ కౌశల్ తదితరులు అందరూ ఆయనను కలిశారు.

ఇంతమంది ఉన్న బ్యాచ్ లో ఎక్స్ట్రా వర్ట్ ఎవరయ్యా అంటే డౌట్ లేకుండా రణవీర్ సింగ్ పేరు చెప్పుకోవచ్చు. తెలుగులో చెప్పుకోవాలంటే కాస్త దగ్గరగా 'అతిగాడు' అనే అర్థం వస్తుంది..నెగెటివ్ సెన్స్ లో కాదు బాబోయ్. అక్కడ అంతమంది జనాలు ఉంటే ఒక్కరు కూడా మోదిజి ని హగ్ చేసుకోలేదుకానీ రణవీర్ మాత్రం తనదైన స్టైల్ లో ఆయన్ను కౌగలించుకున్నాడు. ఇక మోది గారు కూడా మంచి స్మైల్ ఇచ్చారు. ఆ ఫోటోను రణవీర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ "జాదూ కి ఝప్పి.. మన గ్రేట్ నేషన్ ఇండియాకు ప్రధాన మంత్రి అయిన గౌరవనీయులు నరేంద్ర మోది గారు" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

అంతా బాగానే ఉంది గానీ నెటిజనులు మాత్రం ఈ ఫోటో కు.. ఆ క్యాప్షన్ కు మంచి మంచి కామెంట్లు పెట్టారు. "ఇంతకీ జాదూ కి ఝప్పి ఎవరు ఎవరికి ఇస్తున్నారు?" అని ఒకరు అడిగితే.. మరొకరు "ఈ దశాబ్దంలో బెస్ట్ యాక్టర్స్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు" అంటూ పంచ్ వేశారు. మరొకరేమో "మోదిజీ కి కెమెరా ఎక్కడ ఉందో కరెక్ట్ గా తెలుసు.. పాపం యాక్టర్ అయినా రణవీర్ ఎక్కడో చూస్తున్నాడు!" అన్నారు. ఏంటో ఈ నెటిజనులు.. ఎవ్వరినీ వదలరు!