Begin typing your search above and press return to search.
ఆ ప్రముఖ ఆలయం కింద మరో భారీ నిధి?
By: Tupaki Desk | 15 July 2019 5:24 AM GMTదేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన మదురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి సంబంధించిన ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. మహిమలు ఉన్న అమ్మగా పేరు ప్రఖ్యాతులు ఉన్న ఈ ఆలయం కింది భాగంలో ఒక నేలమాళిగ బయటపడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తమిళనాడులోని ఈ దేవాలయానికి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. ఈ గుడికి దగ్గరగా కారు పార్కింగ్ ఏర్పాటు చేసేందుకు కొద్ది నెలలుగా పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా లోతైన గుంత తీస్తుండగా.. పది అడుగుల పొడవైన రాతి స్తంభం తాజాగా బయటపడింది.
దీంతో.. అదే ప్రాంతంలో మరింత లోతుగా తవ్వకాలు జరుపుతుండగా నేలమాళిగ బయటపడింది. దీంతో.. ఈ నేలమాళిగలో ఏముందన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. గుడికి సమీపంలో ఉన్న నేపథ్యంలో భారీ నిధికి అవకాశం ఉండి ఉంటుందా? అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే.. గుడికి కాస్త దూరంలో ఉన్న నేపథ్యంలో నిధికి అవకాశం ఉండకపోవచ్చన్న వాదనా వినిపిస్తోంది. తాజా నేలమాళిగపై సాగుతున్న మరో ప్రచారం ప్రకారం.. ఆ ప్రాంతాన్ని పాలించిన రాణి మంగమ్మాల్ కాలంలో దీన్ని నిర్మించి ఉంటారంటున్నారు.
తమిళనాడులోని ఈ దేవాలయానికి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. ఈ గుడికి దగ్గరగా కారు పార్కింగ్ ఏర్పాటు చేసేందుకు కొద్ది నెలలుగా పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా లోతైన గుంత తీస్తుండగా.. పది అడుగుల పొడవైన రాతి స్తంభం తాజాగా బయటపడింది.
దీంతో.. అదే ప్రాంతంలో మరింత లోతుగా తవ్వకాలు జరుపుతుండగా నేలమాళిగ బయటపడింది. దీంతో.. ఈ నేలమాళిగలో ఏముందన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. గుడికి సమీపంలో ఉన్న నేపథ్యంలో భారీ నిధికి అవకాశం ఉండి ఉంటుందా? అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే.. గుడికి కాస్త దూరంలో ఉన్న నేపథ్యంలో నిధికి అవకాశం ఉండకపోవచ్చన్న వాదనా వినిపిస్తోంది. తాజా నేలమాళిగపై సాగుతున్న మరో ప్రచారం ప్రకారం.. ఆ ప్రాంతాన్ని పాలించిన రాణి మంగమ్మాల్ కాలంలో దీన్ని నిర్మించి ఉంటారంటున్నారు.