Begin typing your search above and press return to search.

కేడీ కిలేడీగా మారిన కన్నడ నటి అరెస్ట్

By:  Tupaki Desk   |   9 Oct 2015 2:20 PM GMT
కేడీ కిలేడీగా మారిన కన్నడ నటి అరెస్ట్
X
దేవుడిచ్చిన అందం ఉంది. నటిగా గుర్తింపు ఉంది.. కాస్త కష్టపడితే అవకాశాలు రాకపోవు. కానీ.. కన్నడ నటి మరియా సుసైరాజ్ మరోసారి తన కిలేడీ చేష్టలతో మరోసారి వార్తల్లోకి వచ్చేశారు. గతంలో హత్య కేసులో మూడేళ్లు జైలుశిక్ష అనుభవించి వచ్చిన ఈ జైలుపక్షికి.. విడుదలైన తర్వాత కూడా విలనిజం పోలేదట్టుంది.

తాజాగా హజ్ యాత్రికుల కోసం కోట్లాది రూపాయిలు కలెక్ట్ చేసి.. వారికి మొండిచేయి చూపించిన ఉదంతంలో గుజరాత్ పోలీసులకు అందిన సమాచారంతో అమ్మడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 1200 మంది హజ్ యాత్రికులను మోసం చేసిందన్న ఆరోపణనను ఆమె మూటగట్టుకున్నారు. గుజరాత్ పోలీసులకు త్వరలో అప్పగించున్న ఆమెపై గతంలో టీవీ నిర్మాత నీరజ్ గ్రోవర్ హత్య కేసులో మరియా అరెస్ట్ అయ్యారు. తాజాగా తన కిలాడీ తన బిజినెస్ పార్టనర్ పరోమిత చక్రవర్తితో కలిసి దాదాపు 1200 మంది హజ్ యాత్రికుల వద్ద నుంచి రూ.2.68కోట్లు వసూలు చేసి ఉడాయించిన వైనం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసిన పోలీసులు త్వరలో వడోదర పోలీసులకు ఆమెను అప్పగించనున్నారు. హజ్ యాత్రికుల నుంచి ఆమె దాదాపు రూ.2.68కోట్లు వసూలు చేసినట్లుగా చెబుతన్నారు. నటిగా అందరి మనసుల్లో నిలిచిపోవాల్సిన మరియా.. ఇప్పుడో క్రిమినల్ గా ముద్ర పడిపోయిన దుస్థితి.