Begin typing your search above and press return to search.

మూడోసారీ మృత్యుంజయుడు ఈ సీఎం!

By:  Tupaki Desk   |   24 Oct 2016 9:22 AM GMT
మూడోసారీ మృత్యుంజయుడు ఈ సీఎం!
X
మణిపూర్‌ ముఖ్యమంత్రి ఓక్‌ రామ్‌ ఇబోబీపై సోమవారం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఉక్రూల్‌ లో సోమవారం ఎన్‌ ఎస్‌ సీఎన్‌ ఉగ్రవాదిగా అనుమానిస్తున్న వ్యక్తి ఆయన్ను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపాడు. అయితే, అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు లేకుండానే ఆయన బయటపడ్డారు. హెలీప్యాడ్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా, ఈ ఘటనలో ఇద్దరు మణిపూర్‌ రైఫిల్‌ జవాన్లు గాయపడ్డారు. రాజధాని ఇంఫాల్ కు 84 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈయనపై ఇలా ఉగ్రవాదులు దాడిచేయడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికి ఇలాంటి దాడులు ఈయనపై రెండుసార్లు జరగగా... తాజా దాడి మూడోది. అదృష్టవసాత్తు ఈ మూడు దాడుల్లోనూ ఆయనకు చిన్నగాయం కూడా కాలేదు!!

2006 మేలో ఒకసారి తోబాల్‌ జిల్లాలో ప్రయాణించిన మార్గంలో ఆయన కాన్వాయ్‌ పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు జరపడంతో ఒక ఉగ్రవాది మృతి చెందగా భద్రతాదళాలకు చెందిన ఓ అధికారి గాయపడ్డారు. ఇది జరిగిన ఆరు నెలలకే సీఎం ఇంటి ఆవరణలో బాంబును విసిరారు ఉగ్రవాదులు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

ఇక 2008 సెప్టెంబర్‌ లో బాబు పరాలోని ఈయన అధికారిక నివాసంపై మరోసారి దాడి చేశారు. ఆ దాడి సమయంలో ఆయన ఇంట్లో నిద్రిస్తున్నారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు గాయపడగా, ఈ దాడిపై పీఆర్‌ ఈపీఏకే బాధ్యత తీసుకుంది. కాగా నేడు జరిగిన ఈ దాడి మూడోది. ఈ మూడు ఉగ్రదాడుల్లోనూ ఈ ముఖ్యమంత్రి మృత్యుంజయయుడుగా బయటపడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/