Begin typing your search above and press return to search.

దీదీకి షాకిచ్చిన సొంత పార్టీ నేతలు

By:  Tupaki Desk   |   17 July 2017 9:47 AM GMT
దీదీకి షాకిచ్చిన సొంత పార్టీ నేతలు
X
ప్రధాని మోడీని తీవ్రంగా వ్యతిరేకించే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఊహించని షాక్ తగిలింది. రాష్ర్టపతి ఎన్నికల్లో ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థి మీరా కుమార్ కు మద్దతివ్వగా తాజాగా ఈ రోజు జరుగుతున్న పోలింగ్ లో మాత్రం ఆమెకు గట్టి షాక్ తగిలింది. తృణమూల్ ప్రజాప్రతినిధుల్లో కొందరు ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు ఓటేయడంతో ఆమె పరువు పోయినట్లయింది.

మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన కొందరు తమ అధినేత్రి నిర్ణయాన్ని కాదని, ఎన్డీయేకు చెందిన రామ్ నాథ్ కోవింద్ కు ఓటు వేసినట్టుగా తెలుస్తోంది. ఓ ఎంపీతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు మీరా కుమార్ ను కాదని కోవింద్ కు ఓటు వేసి, ఆ విషయాన్ని బయటకు వచ్చి చెప్పారు. దీంతో మమత వారిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

కాంగ్రెస్ ప్రకటించిన మీరా కుమార్ కు మద్దతు పలికిన మమతా బెనర్జీ - తన పార్టీ ప్రజా ప్రతినిధులంతా ఆమెకే ఓటు వేయాలని చెప్పినా వీరు ఆ ఆదేశాలు ఉల్లంఘించి మరీ కోవింద్ కు ఓటేసినట్లు తెలుస్తోంది.

అయితే... రహస్య బ్యాలట్ పద్ధతిలో జరిగిన ఓటింగ్ కారణంగా పార్టీలు విప్ జారీ చేయడానికి వీల్లేకుండా చేశారు. దీంతో విప్ ఉల్లంఘన అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కాలేదు కాబట్టి వీరిపై చర్యలు ఎలా ఉంటాయో చూడాలి. పార్టీ పరంగా యాక్షన్ తీసుకునే అవకాశాలున్నాయి.