Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ పై యామినీ పావ‌లా మాట‌కు మాధ‌వి పంచ్‌!

By:  Tupaki Desk   |   19 Oct 2018 6:05 AM GMT
ప‌వ‌న్ పై యామినీ పావ‌లా మాట‌కు మాధ‌వి పంచ్‌!
X
క‌వాతుతో ఏపీ టీడీపీ కుత‌కుత‌లాడిపోతోంది. త‌మ్ముళ్ల‌కు క‌వాతు ఒక గాయంగా మారితే.. ఆ స‌భ‌లో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మ‌రింత మండిప‌డుతున్నారు. త‌మ అధినేత చంద్ర‌బాబుతో పాటు.. త‌మ యువ అధినేత లోకేశ్ పై ప‌వ‌న్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టం తెలిసిందే. ప‌వ‌న్ చేసిన వార‌స‌త్వ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ మ‌హిళా నేత సాధినేని యామినీ మండిప‌డ్డారు.

వార‌స‌త్వం గురించి మాట్లాడే హ‌క్కు ప‌వ‌న్ కు లేద‌న్నారు. పావ‌లాకు కూడా చెల్ల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్.. రెండు వేల రూపాయిల నోటు లాంటి లోకేశ్ బాబు గురించి మాట్లాడ‌ట‌మా? అంటూ క‌స్సుమ‌న్నారు. లోకేశ్ గురించి ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేయ‌టం కామెడీగా కొట్టిపారేశారు.

యామినీ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత.. ప‌వ‌న్ కు వీరాభిమానిగా చెప్పుకునే టాలీవుడ్ న‌టి మాధ‌వీ ల‌త తాజాగా చెల‌రేగిపోయారు. ఫేస్ బుక్ లో ఆమె యామినీకి దిమ్మ తిరిగేలా భారీ పంచ్ ఇచ్చారు. ప‌వ‌న్ ను ఉద్దేశించి ఇలా మాట్లాడ‌తారా? అంటూ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన మాధ‌వీల‌త పోస్టులో ఉన్న విష‌యాల్ని చూస్తే..

"ఇన్నాళ్లు పోనీలే అని ఊరుకున్నా.. ఇప్పుడు నాకు కాలింది. వారసత్వం గురించి మాట్లాడే హక్కు లేదా..? నిజమే ఎందుకంటే ఆయన వారసత్వంతో రాలేదు కదా తెలియదులేమ్మా..! కవాతు దేని కోసమా....? ఏం చేశాడనా....? ఏం చేయలేదు అమ్మా ఏదో మీరు చేయలేనివి ఆయన చేసేద్దామనే తపన అంతే. ప్రజల కోసం వద్దు.. ఆయన పర్సనల్ లైఫ్ మీద పడి ఏడవటమే. ఎందుకంటే మీకు పీకడానికి, చెప్పడానికి వేరే కంప్లైంట్స్ లేవు కదా....?"

"మొన్నటి దాకా బీజేపీ డబ్బులు తీసుకున్నాడు.. నిన్నేమో ఎవడో డబ్బులు ఖర్చు పెట్టాడు.. మీ అయ్యలు ఇచ్చారా..? మీ తాతలు ఇచ్చారా..? ఇవ్వలేదుగా ఇంక మళ్లీ నొప్పెందుకు..? పైసల్ ఇవ్వకుండా ఇంతమంది జనం ఎందుకు వచ్చారనా....? ఉంటదిలే కడుపులో మంట. ‘ఈఎన్ ఓ’ (ENO) అని ఎప్పుట్నుంచో ఉంది అది తాగితే తగ్గుద్దేమో మరి. పని చేయకపోతే అపోజిషన్ అనేది ప్రశ్నించాలి కానీ అసలు మొదలెట్టకుండా ఆపడం కాదు.. ఇకనైనా నేర్చుకొండి" అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇలాంటి పోస్టు పెట్టిన త‌ర్వాత మాధ‌విల‌త‌ను ప‌వ‌న్ అభిమానులు ఎంత‌లా పొగిడేస్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.