Begin typing your search above and press return to search.

తమిళనాడులో 'మేఘా' థర్మల్ ప్లాంట్లు

By:  Tupaki Desk   |   1 Aug 2019 4:48 AM GMT
తమిళనాడులో మేఘా థర్మల్ ప్లాంట్లు
X
జల - వాయు - సౌర విద్యుత్ రంగాలతో పాటు విద్యుత్‌ ట్రాన్స్‌ మిషన్‌ రంగాలలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులను పూర్తి చేసిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్ (ఎంఇఐఎల్‌) తాజాగా రెండు థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో ఇంటిగ్రేటెడ్‌ కంపెనీగా ఎదిగింది. తమిళనాడులోని ట్యుటికోరిన్‌‌ లో 525 మెగావాట్లు - నాగాయ్‌ లో 150 మెగావాట్ల సామర్థ్యాలు గల బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ఎంఇఐఎల్ నిర్మించింది. నాగాయ్‌ థర్మల్‌ ప్లాంట్‌ లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ ను గ్రిడ్‌ కు అనుసంధానం చేశారు. ఈప్లాంట్‌ ను ఈ నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

విద్యుత్‌ వెలుగులకు సర్వసిద్ధం

తమిళనాడు విద్యుత్ డిమాండ్‌ ను నెరవేర్చేందుకు చేపట్టిన నాగాయ్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర నిర్మాణాన్ని పూర్తి చేసి విద్యుత్‌ గ్రిడ్‌ కు ఎంఇఐఎల్ అనుసంధానం చేసింది. ఈపీసీ పద్ధతిలో కెవికే ఎనర్జీ అండ్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ తో కలిసి జాయింట్‌ వెంచర్‌ గా ఈ ప్లాంట్‌ ను పూర్తి చేసింది. తమిళినాడు నాగపట్నం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో 230 ఎకరాల్లో నిర్మించిన ఈ ప్లాంటుకు రైలు - రోడ్డు - విమాన మార్గాలతో సముద్ర రవాణా మార్గాలు కూడా ఉండడం విశేషం. దీంతో ప్లాంట్‌ కు అవసరమైన బొగ్గులో 30 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం చాలా సులువు. ఈ ప్లాంట్‌ లో 125 మీటర్ల ఎత్తైన చిమ్మి - 530టీపీహెచ్‌ సామర్థ్యం గల బాయిలర్‌‌ లను ఎంఇఐఎల్ ఏర్పాటు చేసింది. బిహెచ్‌ ఈఎల్‌ రూపొందించిన 150 మెగావాట్ల టర్ బైన్‌ జనరేటర్‌ ను ఎంఇఐఎల్ ఈ ప్లాంటులో ఏర్పాటు చేసింది. అలాగే ఎయిర్‌ కూల్డ్‌ కండెన్సర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటు నిర్మాణానికి అవసరమైన 3700 టన్నుల స్టీల్‌ను ఎంఇఐఎల్ తమ ఉత్పత్త యూనిట్‌ నుంచే సరఫరా చేసింది. ఈ ప్లాంటు నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ సరఫరా కోసం 24.6 కిలోమీటర్ల ట్రాన్స్‌ మిషన్‌ లైన్‌ ను తిరువూరులోని 230కేవీ సబ్‌ స్టేషన్‌ వరకు వేశారు. వారం రోజులకు సరిపడా బొగ్గు నిల్వకు 114 టీపీహెచ్‌ సామర్ధ్యం కలిగిన స్టోరేజి సదుపాయాన్ని కూడా ఎంఇఐఎల్ నిర్మించింది . జూలై 10 నాటికే థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులన్నింటని పూర్తి చేసి కమిషనింగ్‌‌ ను పూర్తి చేసింది. ఇప్పటికే 130 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ప్రైవేట్‌ ఏజెన్సీలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. లాంఛనంగా ప్రారంభం మాత్రమే మిగిలి ఉంది.

525 మెగావాట్ల ట్యుటికోరిన్‌ థర్మల్‌

ఎన్‌ ఈపీసీ కోసం ఈపీసీ పద్దతిలో నిర్మిస్తున్న 525 మెగావాట్ల ట్యుటికోరిన్ థర్మల్‌ పవర్ ప్రాజెక్ట్‌ ఫేజ్‌4 ప్రారంభానికి సిద్ధంగా ఉంది. తమిళనాడు లోని ట్యుటికోరిన్‌ జిల్లాలో నెలకొల్పుతున్నారు. ఎంఇఐఎల్ ఫైనాన్షియల్‌ - టెక్నికల్‌ బిడ్లలో అర్హత సాధించి ఈ కాంట్రాక్టును సాధించింది. విఏ చిదంబరం పోర్టుకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు నుంచి వెలువడే బూడిదను వేయడానికి వడక్కుకరిసెరి గ్రామంలో 100హెక్డార్ల స్థలంలో యాష్‌ పాండ్‌ ను కూడా ఎంఇఐఎల్ నిర్మించింది. ఈ ప్లాంట్‌ లో 1700టీపీహెచ్‌ సామర్ధ్యం గల బాయిలర్‌ ను ఏర్పాటు చేసింది. బీహెచ్‌ ఈఎల్‌ తయారు చేసిన 555 మెగావాట్ల టర్ బైన్‌ జనరేటర్లను కూడా ఇప్పటికే అమర్చింది. 500టీపీహెచ్‌ కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ సముద్ర జలాలను తీసుకునేందుకు 6700 క్యుసెక్కుల సామర్ధ్యం గల ఇంటేక్‌ - గంటకు 66000 క్యూమెక్స్‌ సామర్థ్యం కలిగిన కూలింగ్ వాటర్‌ సిస్టమ్ - 275 మీటర్ల ఎత్తుగల చిమ్మిని ఎంఇఐఎల్ ఇప్పటికే నిర్మించింది. ఈ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ కు కావాల్సిన స్టీల్‌ ను ఎంఇఐఎల్ స్వయంగా సరఫరా చేసింది. అలాగే, 10 కిలో మీటర్ల సీడబ్ల్యూ పైప్‌ లైన్‌ ను కూడా సరఫరా చేసింది. ఈ ప్లాంట్‌‌ లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ ను సరఫరా చేయడానికి 48 కిలోమీటర్ల 400కేవీ ట్రాన్స్‌ మిషన్‌ లైన్‌ ను కూడా నెలకొల్పడానికి తమిళనాడు జనరేషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (ట్రాన్ జెడ్ కో) ఎంఈఐఎల్‌ కే అప్పగించింది. థర్మల్‌ ప్లాంట్‌ నుంచి ఒట్టిపీడరమ్‌ సబ్‌ స్టేషన్‌ వరకు ఈ ట్రాన్స్‌ మిషన్‌ లైన్ వేశారు.

విద్యుదుత్పత్తిలో అందవేసిన చేయి

జల - వాయు - సౌర విద్యుత్‌ రంగంలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులను నిర్మించి నిర్వహిస్తున్నది. మొత్తం 112 మెగావాట్ల సౌరవిద్యుత్‌‌ ను అందుబాటులోకి తెచ్చింది. వడోదర బ్రాంచ్‌ కెనాల్‌ పై 10 మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాన్ని సర్దార్‌ సరోవర్‌ నర్మదా నిగమ్‌ కోసం ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే వినూత్న మైనది గాను - సృజనాత్మక ప్రాజెక్టుల జాబితాలో చోటు చేసుకుంది. మహారాష్ట్ర జెన్‌ కో కోసం చంద్రాపూర్‌ లో 2 మెగావాట్లు - సాక్రి వద్ద 50 మెగా వాట్లసౌర విద్యుత్‌ కేంద్రాలను ఎంఇఐఎల్ నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్‌ లోని అనంతపురం జిల్లా నాగలాపురం వద్ద 50 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ కేంద్రాన్ని బీఓఓటీ ప్రాతిపదికన పూర్తి చేసింది. ఇక జల విద్యుత్‌ రంగంలో హిమాచల్‌ ప్రదేశ్‌ లోని లాంబడ్గ్‌ లో 25 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నది. గుజరాత్‌ లోని సౌరాష్ట్ర బ్రాంచ్‌ కెనాల్‌ మీద 45 మెగావాట్ల సామర్థ్యంలతో మూడు జలవిద్యుత్‌ కేంద్రాలను నెలకొల్పింది. ఇందులో రెండు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించాయి.