Begin typing your search above and press return to search.

బాలయ్య స్పీచ్‌ లపై లక్ష్మీ పార్వతి కామెంట్స్‌

By:  Tupaki Desk   |   18 Dec 2018 6:40 AM GMT
బాలయ్య స్పీచ్‌ లపై లక్ష్మీ పార్వతి కామెంట్స్‌
X
బాలకృష్ణ సినిమాల్లో భారీ డైలాగ్స్‌ అయితే చెబుతారు కాని పబ్లిక్‌ మీటింగ్స్‌ లో సరిగా మాట్లాడలేరు, ఆయన మాట్లాడే మాటలు కొన్ని సార్లు అర్థం కావు, తడబడుతారు అంటూ మొదటి నుండి కామెంట్స్‌ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలకృష్ణ సారే జహాసే అచ్చ.. పాటను పాడటం ఎంత పెద్ద చర్చకు తెర లేపిందో తెల్సిందే. బుల్‌ బుల్‌ బాలయ్య గా సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అయిన విషయం తెల్సిందే. తాజాగా ఆ విషయమై లక్ష్మీ పార్వతి తనదైన శైలిలో స్పందించింది.

బాలకృష్ణ స్పీచ్‌ ల గురించి మీ అభిప్రాయం ఏంటీ అన్న సందర్బంలో... ఒక మనిషి తన లోపాన్ని తెలుసుకుని సరి దిద్దుకోవాలి, అలా సరి దిద్దుకుంటేనే తర్వాత ఆ తప్పు జరుగకుండా ఉంటుంది. కాని బాలకృష్ణ మాత్రం పదే పదే ఆ తప్పును చేస్తూ ఉన్నాడు. మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అయ్యో.. బాలకృష్ణ మా నియోజక వర్గంకు వచ్చి తెలుగు దేశం తరపున ప్రచారం చేస్తే బాగుండేది, అప్పుడు మేము గెలిచే వాళ్లం అనుకుంటున్నారు. బాలకృష్ణ మాట్లాడే మాటలు పూర్తిగా అర్థం అయ్యాయి అంటూ ఎవరైనా నా వద్దకు వస్తే వారికి బహుమానం ఇస్తానంటూ లక్ష్మీ పార్వతి నవ్వుతూ కామెంట్‌ చేసింది.

బాలకృష్ణ మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు, లోకేష్‌ ఇంకా ఇతర తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియని పరిస్థితి ఉంది. మొత్తానికి టీడీపీ మొత్తం ఒక కామెడీ పార్టీ అయ్యిందని లక్ష్మీ పార్వతి ఎద్దేవ చేసింది.