Begin typing your search above and press return to search.
5 అడుగుల మహిళా దళంతో ఎమ్మెల్యే హత్య!
By: Tupaki Desk | 24 Sep 2018 5:14 AM GMTఎంత పెద్ద చేప అయినా.. ఎర చాలా కీలకం. ఎంత పెద్ద టార్గెట్ అయినా సరే.. పక్కా వ్యూహం చాలా అవసరం. ఇదే విధానాన్ని తాజా అరుకు ఎమ్మెల్యే హత్యకు మావోలు అనుసరించినట్లుగా చెబుతున్నారు. బెయిటెడ్ అంబుష్ తో ఎమ్మెల్యేను హతమార్చినట్లుగా భావిస్తున్నారు.
బెయిటెడ్ అంబుష్ అంటే.. ఎర వేసి మట్టుబెట్టటం.. తాజా అరుకు ఎమ్మెల్యే హత్యలోనూ మావోలు ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. చిన్నపాటి సమాచారాన్ని లీక్ చేసి.. ఉచ్చులోకి లాగటం.. తాము అనుకున్నట్లుగా జరిగితే.. ఆ వెంటనే పెను విధ్వంసాన్ని సృష్టించటం మావోలకు అలవాటే. అందునా.. మావోల అగ్రనేత ఆర్కే అలియస్ అక్కిరాజు హరగోపాల్ కు ఇలాంటి వ్యూహాలు పన్నటంలో చాలా నేర్పరి.
గత ఏడాది మే 12న బస్తర్ లో సీఆర్ఫీఎఫ్ బలగాలు బెయిటెడ్ అంబుష్ తో జవాన్లను ఉచ్చులోకి లాగి ఏకంగా పాతిక మంది పోలీసుల్ని మట్టుబెట్టటం అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజా ఉదంతంలో అరకు ఎమ్మెల్యేను మాట్లాడుకుందాం అంటూ సందేశాలు పంపి మరీ మట్టుబెట్టటం సంచలనంగా మారింది.
తనతో మాట్లాడటానికి వస్తారని భావించినా.. మిలీషియా సభ్యులు వస్తారన్న అంచనా వేయలేని అరకు ఎమ్మెల్యేతో పాటు.. మాజీ ఎమ్మెల్యే ఇద్దరూ ఉచ్చులోకి చిక్కారని చెబుతున్నారు. తాజా ఆపరేషన్లో మరో సంచలనం ఏమంటే.. దాడిలో సగం మంది మహిళా మావోలు ఉండటం. నేతల్ని తమతో తీసుకెళ్లటం నుంచి కాల్చి చంపటం వరకూ మహిళా మావోలే చేయటం షాకింగ్ గా మారింది.
ఈ ఆపరేషన్ లో పాల్గొన్న మహిళలు అంతా ఐదుడగులు ఎత్తు మాత్రమే ఉండటం చూస్తుంటే.. పోలీసులకు ఏ మాత్రం సందేహం కలగకుండా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మహిళా మావోలకు తపంచాలు ఇస్తే.. వారికి పహరాగా పురుష మావోలు రక్షణ కల్పించినట్లుగా చెబుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున మహిళా మావోలు సీన్లోకి రావటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
బెయిటెడ్ అంబుష్ అంటే.. ఎర వేసి మట్టుబెట్టటం.. తాజా అరుకు ఎమ్మెల్యే హత్యలోనూ మావోలు ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. చిన్నపాటి సమాచారాన్ని లీక్ చేసి.. ఉచ్చులోకి లాగటం.. తాము అనుకున్నట్లుగా జరిగితే.. ఆ వెంటనే పెను విధ్వంసాన్ని సృష్టించటం మావోలకు అలవాటే. అందునా.. మావోల అగ్రనేత ఆర్కే అలియస్ అక్కిరాజు హరగోపాల్ కు ఇలాంటి వ్యూహాలు పన్నటంలో చాలా నేర్పరి.
గత ఏడాది మే 12న బస్తర్ లో సీఆర్ఫీఎఫ్ బలగాలు బెయిటెడ్ అంబుష్ తో జవాన్లను ఉచ్చులోకి లాగి ఏకంగా పాతిక మంది పోలీసుల్ని మట్టుబెట్టటం అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజా ఉదంతంలో అరకు ఎమ్మెల్యేను మాట్లాడుకుందాం అంటూ సందేశాలు పంపి మరీ మట్టుబెట్టటం సంచలనంగా మారింది.
తనతో మాట్లాడటానికి వస్తారని భావించినా.. మిలీషియా సభ్యులు వస్తారన్న అంచనా వేయలేని అరకు ఎమ్మెల్యేతో పాటు.. మాజీ ఎమ్మెల్యే ఇద్దరూ ఉచ్చులోకి చిక్కారని చెబుతున్నారు. తాజా ఆపరేషన్లో మరో సంచలనం ఏమంటే.. దాడిలో సగం మంది మహిళా మావోలు ఉండటం. నేతల్ని తమతో తీసుకెళ్లటం నుంచి కాల్చి చంపటం వరకూ మహిళా మావోలే చేయటం షాకింగ్ గా మారింది.
ఈ ఆపరేషన్ లో పాల్గొన్న మహిళలు అంతా ఐదుడగులు ఎత్తు మాత్రమే ఉండటం చూస్తుంటే.. పోలీసులకు ఏ మాత్రం సందేహం కలగకుండా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మహిళా మావోలకు తపంచాలు ఇస్తే.. వారికి పహరాగా పురుష మావోలు రక్షణ కల్పించినట్లుగా చెబుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున మహిళా మావోలు సీన్లోకి రావటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.