Begin typing your search above and press return to search.

రాజకీయ సన్యాసమే.. రెడ్డిగారి సవాల్!

By:  Tupaki Desk   |   22 March 2019 4:43 PM GMT
రాజకీయ సన్యాసమే.. రెడ్డిగారి సవాల్!
X
తెలంగాణలో మొత్తం పదహారు ఎంపీ సీట్లను గెలవబోతున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ప్రకటనలు చేస్తూ ఉన్నారని - వారు నిజంగానే ఆ పని చేస్తే తను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీ అని ప్రకటించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెరాస గనుక పదహారు ఎంపీ సీట్లను నెగ్గితే తను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి రెడీ అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ టికెట్లను అమ్ముకుందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నల్లగొండ ఎంపీ సీటుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించగానే.. తెరాస అభ్యర్థి నర్సయ్య గౌడ్ కు మతిస్థిమితం తప్పిందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థుల విషయంలో కేసీఆర్ కే నమ్మకం లేదని.. తెరాస అభ్యర్థులు డమ్మీలు అనే అంశం కేసీఆర్ కు కూడా తెలుసని.. అందుకే వారిని చూసిగాక, తనను చూసి ఓటు వేయాలని ప్రజలను కేసీఆర్ అడుక్కొంటున్నారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తాము కేసీఆర్ కు కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా, ఇప్పుడు కోమటిరెడ్డి సోదరుల జోలికి వస్తే.. మళ్లీ అదే జరగుతుందని.. తన సోదరుడు గనుక ఈ ఎన్నికల్లో ఓడిపోతే తను శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి రెడీ అని కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.