Begin typing your search above and press return to search.

బీజేపీ వైపుకే..క్లారిటీ ఇస్తున్న రెడ్డిగారు!

By:  Tupaki Desk   |   20 Jun 2019 8:01 AM GMT
బీజేపీ వైపుకే..క్లారిటీ ఇస్తున్న రెడ్డిగారు!
X
కాంగ్రెస్ పార్టీ తనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో తన అనుచరగణం వద్ద ఆ అంశం గురించి మాట్లాడుతున్నారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తను భారతీయ జనతా పార్టీలోకి చేరే ఉద్ధేశంతో ఉన్నట్టుగా ఆయన స్పష్టం చేస్తున్నారట. ఇక తర్జనభర్జనలు లేవని.. తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికే నిర్ణయించుకున్నట్టుగా ఆయన ప్రకటించారట.ఈ విషయాన్ని ఆయన మీడియా ముందుకు కూడా వచ్చి చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది.

తెలంగాణలో టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ నే అని ఇటీవల రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాబోదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశాలు లేవని ఆయన తేల్చారు. దీంతో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేయవచ్చనే ప్రచారం ఊపందుకుంది.

అయితే ఆ తర్వాత ఆ అంశం మీద సూటిగా మాట్లాడలేదు రాజగోపాల్ రెడ్డి. ఢిల్లీ వెళ్లి ఊహాగానాలను రేపారాయన. చివరకు ఈ అంశంపై ఆయన తన అనుచవర్గం వద్ద స్పందిస్తూ తను కమలం పార్టీలోకి చేరడానికి రెడీ అయినట్టుగా స్పష్టత ఇచ్చారట. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా కూడా అనౌన్స్ చేయబోతున్నట్టుగా సమాచారం.