Begin typing your search above and press return to search.

కిడారి చివ‌రి కాల్ గురించి చెప్పిన స‌తీమ‌ణి!

By:  Tupaki Desk   |   24 Sep 2018 4:59 AM GMT
కిడారి చివ‌రి కాల్ గురించి చెప్పిన స‌తీమ‌ణి!
X
రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు.. యావ‌త్ దేశం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డిన ఉదంతంగా ఏపీ ఎమ్మెల్యే కిడారిని న‌క్స‌ల్స్ పొట్ట‌న‌బెట్టుకోవ‌టంగా చెప్పాలి. త‌న భ‌ర్త హ‌త్య‌కు గురి కావ‌టాన్ని ఎమ్మెల్యే స‌తీమ‌ణి.. ఆయ‌న కుటుంబ స‌భ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వారి వేద‌న ప‌ట్ట‌న‌ల‌వికానిదిగా మారింది. ఇక‌.. ఎమ్మెల్యే స‌తీమ‌ణి రోద‌న‌లు గుండెల్ని క‌దిలించి వేస్తున్నారు.

త‌న భ‌ర్త త‌న‌తో మాట్లాడిన చివ‌రి ఫోన్ కాల్‌ ను గుర్తుకు తెచ్చుకొని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సోమ‌వారం గ్రీవెన్స్ కార్య‌క్ర‌మం ఉండ‌టంతో తాను విశాఖ‌ప‌ట్ట‌ణానికి వ‌చ్చేసిన‌ట్లు చెప్పారు. విశాఖ‌కు చేరుకున్న అనంత‌రం భ‌ర్త‌కు తాను ఫోన్ చేసి మాట్లాడిన‌ట్లు చెప్పారు.

తాను కూడా విశాఖ‌కు వ‌చ్చేస్తున్న‌ట్లు త‌న‌తో చెప్పార‌న్నారు. నీవు అలాగే అంటావు.. నీ ప్రోగ్రామ్స్ నీకుంటాయి.. ఎక్క‌డొస్తావు? అని తాను అన్నాన‌ని.. తాను అర‌కులో ఉన్న‌ట్లు చెప్పార‌న్నారు. ఆయ‌న‌తో తాను మాట్లాడిన చివ‌రి కాల్ అదేన‌ని చెప్పారు.

ఈ ఉద‌యం (ఆదివారం) కారు డ్రైవ‌ర్ త‌న‌కు ఫోన్ చేసి.. సార్ ను న‌క్స‌ల్స్ చంపేశార‌ని చెప్పార‌ని.. త‌న‌కేం తోచ‌లేద‌ని.. సాయం కోసం స్నేహితుల ఇంటికి ప‌రిగెత్తాన‌ని.. ఎస్పీ.. క‌లెక్ట‌ర్ ల‌కు ఫోన్లు చేశానంటూ రోదించారు. న‌క్స‌ల్స్ నుంచి త‌న‌కు ముప్పు ఉంద‌న్న విష‌యాన్ని త‌న‌కు కానీ.. త‌మ కుటుంబ స‌భ్యుల‌తో కానీ కిడారి ఎప్పుడూ చెప్ప‌లేద‌ని ఆయ‌న స‌తీమ‌ణి చెబుతున్నారు.