Begin typing your search above and press return to search.

ఎంపీల‌కు ఐఫోన్ 10 గిఫ్ట్‌ గా ఇస్తున్న సీఎం...

By:  Tupaki Desk   |   17 July 2018 2:25 PM GMT
ఎంపీల‌కు ఐఫోన్ 10 గిఫ్ట్‌ గా ఇస్తున్న సీఎం...
X
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కంటతడి పెట్టి మీడియా దృష్టిని త‌న‌వైపు తిప్పుకొన్న సంగ‌తి తెలిసిందే. బెంగళూరులో ఆదివారం జేడీఎస్ కార్యకర్తల సన్మాన కార్యక్రమంలో కుమారస్వామి తీవ్ర ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. నిత్యం సంకీర్ణ ప్రభుత్వ గరళాన్ని దిగమింగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఆనందంగా ఉన్నా, తాను మాత్రం సంతోషంగా లేనని చెప్పారు. దేవుడి దయతోనే తాను సీఎం అయ్యానని - తాను ఈ పదవిలో ఎన్నిరోజులు ఉండాలనేది ఆయనే నిర్ణయిస్తాడని అన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో కుమారస్వామి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఇలా సీటుకు ఓ వైపు ఎస‌రు వ‌స్తుంద‌ని స్వ‌యంగా ఆయ‌న పేర్కొన్న‌ స‌మ‌యంలోనే తాజాగా మరో సంచ‌ల‌న చ‌ర్య చేప‌ట్టారు.

రాష్ట్ర ఎంపీలకు ఖరీదైన ఐఫోన్X(రూ.1.02 లక్షలు) ను - ఖరీదైన బ్యాగ్(రూ.5,000)లను ఇచ్చేందుకు కుమార‌స్వామి ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయితే, ఓ వైపు ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతుంటే...ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం చ‌ర్చనీయాంవంగా మారింది. కర్ణాటక ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. కానీ తమ ఎంపీలకు లక్షల రూపాయలు విలువచేసే ఐఫోన్ లు - ఖరీదైన ల్యాప్ టాప్ బ్యాగ్‌ ల‌ను మాత్రం గిఫ్ట్ గా ఇస్తుండ‌టం వ‌ల్ల ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎంపీలకు ఖరీదైన ఐఫోన్ - ల్యాప్ టాప్ బ్యాగ్‌ లను పంచిన కుమారస్వామి ప్రభుత్వంపై పలువురు బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. ఇవ్వడం ప్రజాధనాన్ని దుర్వినియోగపర్చడమే అవుతుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా కుమారస్వామి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బెంగళూరులోని సివిక్ వర్కర్లకు ప్రభుత్వం 150 కోట్లు చెల్లించాల్సి ఉందని రాజీవ్ తెలిపారు. ఈ విషయంపై సీఎం కుమారస్వామికి రాజీవ్ చంద్రశేఖర్ లేఖ రాశారు. 6 నెలలుగా సివిక్ వర్కర్లు జీతాలు చెల్లించకపోవడంతో అప్పుల భాధలు తట్టుకోలేక ఇప్పటికే ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని - రాష్ట్ర రైతులు కూడా పంటలకు గిట్టుబాటు ధర లేక ఆందోళనలో ఉన్నారని, ఇటువంటి సమయంలో ప్రజా ధనాన్ని దుర్వినియోగపర్చడం కరెక్ట్ కాదని ఆ లేఖలో తెలిపారు. తనకు గిఫ్ట్ గా ఇచ్చిన ఐఫోన్ ను కూడా తిరిగి ఇస్తానని రాజీవ్ తెలిపారు.

ఓవైపు ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా మ‌రోవైపు గిఫ్ట్‌ల పంపిణీ చేస్తున్న వ్యవహారంపై స్పందించిన సీఎం కుమారస్వామి… ఈ గిఫ్ట్ ల పంపీణీ గురించి తనకు తెలియదన్నారు. ఐఫోన్ లు పంచమని తాను ఎవ్వరికీ చెప్పలేదన్నారు. ఇది జలవనరుల శాఖ మంత్రి డీకే. శివకుమార్ తీసుకున్న నిర్ణయమని తనకు తెలిసిందని, దీనిపై విచారణకు ఆదేశించి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.