Begin typing your search above and press return to search.

హీట్ పెంచేందుకు ఆయ‌న్ను క‌లిసిన ముద్ర‌గ‌డ‌

By:  Tupaki Desk   |   31 May 2016 10:01 AM GMT
హీట్ పెంచేందుకు ఆయ‌న్ను క‌లిసిన ముద్ర‌గ‌డ‌
X
కాపు రిజర్వేషన్ల సాధన కోసం రెండో ద‌ఫా త‌న గ‌ళం వినిపిస్తున్న కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ క్ర‌మంలో దూకుడు పెంచుతున్నారు. ఇప్ప‌టికే ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు - పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి - ఎంపీ చిరంజీవి - వైసీపీ అగ్ర‌నేత బొత్స సత్యనారాయణల‌తో ముద్ర‌గ‌డ స‌మావేశ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో తాజాగా సినీన‌టుడు - మాజీ ఎంపీ మోహ‌న్‌ బాబును క‌లిశారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలో ఉన్న మోహన్‌ బాబు ఫాంహౌస్‌ లో ఆయ‌న్ను ముద్ర‌గ‌డ క‌లిశారు. ఈ సందర్భంగా కాపు ఉద్య‌మం సాగుతున్న తీరు - ప్ర‌స్తుత ప‌రిస్థితులు - ప్ర‌భుత్వం నుంచి వ‌స్తున్న స్పంద‌న త‌దిత‌రాలు చ‌ర్చించారు. ఇదిలాఉండ‌గా గతంలోనే ముద్ర‌గ‌డ త‌న స‌న్నిహితుడు అని మోహ‌న్‌ బాబు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ భేటీ జ‌ర‌గ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

గ‌తంలో లాగా త‌ను ఒంట‌రిగా ముందుకువెళ్ల‌డం కాకుండా మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప‌నిలో ఉన్న ముద్ర‌గ‌డ వివిధ పార్టీలకు చెందిన నాయకులను, సినీదిగ్గ‌జాల‌ను క‌లుస్తున్నారు. ఈ క్ర‌మంలో అందుబాటులో ఉన్న‌వారితో వ్య‌క్తిగ‌తంగా భేటీ అవుతున్నారు. అది సాధ్య‌ప‌డని వారితో ఫోన్‌ లో మాట్లాడుతున్నారు. జనసేన అధినేత - ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కల్యాణ్ - మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు ఫోన్‌‌ లో మాట్లాడి ప‌రిస్థితులు వివ‌రించారు.