Begin typing your search above and press return to search.
సమంతతో ప్రచారం ఎందుకో చెప్పిన కేటీఆర్
By: Tupaki Desk | 25 Jun 2017 6:31 AM GMTకొందరు నేతలు కొన్ని సందర్భాల్లో చెప్పే మాటలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. తన మాటల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా మాట్లాడే అతి కొద్దిమంది నేతల్లో తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఒకరు. తండ్రి అంత కాకున్నా.. తనదైన శైలిలో మాటలు చెప్పటంలో కేటీఆర్ చెబుతుంటారు.
కొన్ని విషయాల పట్ల కేటీఆర్ ప్రదర్శించే ఆసక్తి కాస్త ఎక్కువే. చేనేతను ప్రమోట్ చేసే విషయంలో ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే ఆయన.. వారానికి ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగులంతా చేనేత వస్త్రాల్ని ధరించాలన్న సూచనను చేయటం మర్చిపోలేం.
చేనేతను ప్రమోట్ చేసేందుకు ప్రముఖ సినీ నటి సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఈ సందర్భంగా వెల్లువెత్తిన విమర్శలను ఆయన ధీటుగా ఎదుర్కొన్నారు కూడా. తాజాగా నేతన్నకు చేయూత పేరుతో తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసిన సరికొత్త పథకాన్ని ఆయన షురూ చేశారు.
ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ముచ్చట్లను చెప్పారు. సినీ నటి సమంతను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టటం వెనుకున్న విషయాన్ని చెబుతూ.. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వస్త్రాల్ని ఉత్పత్తి చేసే చేనేత రంగానికి మనుగడ ఉంటుందని.. ఆ విషయాల మీద అవగాహన ఉన్నందునే సినీనటి సమంత చేత ప్రచారం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. కేటీఆర్ మాటలే నిజమని అనుకుంటే.. సమంత తన ఫ్యాషన్ కోసం ఫ్యాషన్ డిజైనర్ల మీద ఎందుకు ఆధారపడుతున్నట్లు? అన్నది ఒక డౌట్ గా చెప్పాలి.
ఈ విషయాన్ని వదిలేస్తే.. మరో ఆసక్తికరమైన ముచ్చటను చెప్పారు మంత్రి కేటీఆర్. తాను విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు.. అక్కడి ప్రముఖలకు ఇచ్చే కానుకల్లో పోచంపల్లి వస్త్రాలేనని చెప్పారు. అమెరికాకు వెళ్లినా.. జపాన్ కు వెళ్లినా.. పోచంపల్లి శాలువాలను తీసుకెళ్లి వారికి కప్పటమేకాదు.. మన నేతన్నల గురించి చెబుతుంటానని చెప్పారు. మొత్తంగా చూస్తే.. తన మాటలతో చేనేతల మనసుల్ని దోచేలా కేటీఆర్ మాట్లాడారనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
కొన్ని విషయాల పట్ల కేటీఆర్ ప్రదర్శించే ఆసక్తి కాస్త ఎక్కువే. చేనేతను ప్రమోట్ చేసే విషయంలో ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే ఆయన.. వారానికి ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగులంతా చేనేత వస్త్రాల్ని ధరించాలన్న సూచనను చేయటం మర్చిపోలేం.
చేనేతను ప్రమోట్ చేసేందుకు ప్రముఖ సినీ నటి సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఈ సందర్భంగా వెల్లువెత్తిన విమర్శలను ఆయన ధీటుగా ఎదుర్కొన్నారు కూడా. తాజాగా నేతన్నకు చేయూత పేరుతో తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసిన సరికొత్త పథకాన్ని ఆయన షురూ చేశారు.
ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ముచ్చట్లను చెప్పారు. సినీ నటి సమంతను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టటం వెనుకున్న విషయాన్ని చెబుతూ.. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వస్త్రాల్ని ఉత్పత్తి చేసే చేనేత రంగానికి మనుగడ ఉంటుందని.. ఆ విషయాల మీద అవగాహన ఉన్నందునే సినీనటి సమంత చేత ప్రచారం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. కేటీఆర్ మాటలే నిజమని అనుకుంటే.. సమంత తన ఫ్యాషన్ కోసం ఫ్యాషన్ డిజైనర్ల మీద ఎందుకు ఆధారపడుతున్నట్లు? అన్నది ఒక డౌట్ గా చెప్పాలి.
ఈ విషయాన్ని వదిలేస్తే.. మరో ఆసక్తికరమైన ముచ్చటను చెప్పారు మంత్రి కేటీఆర్. తాను విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు.. అక్కడి ప్రముఖలకు ఇచ్చే కానుకల్లో పోచంపల్లి వస్త్రాలేనని చెప్పారు. అమెరికాకు వెళ్లినా.. జపాన్ కు వెళ్లినా.. పోచంపల్లి శాలువాలను తీసుకెళ్లి వారికి కప్పటమేకాదు.. మన నేతన్నల గురించి చెబుతుంటానని చెప్పారు. మొత్తంగా చూస్తే.. తన మాటలతో చేనేతల మనసుల్ని దోచేలా కేటీఆర్ మాట్లాడారనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/