Begin typing your search above and press return to search.
గులాబీ పార్టీలో నెంబర్ 2 తేలిపోయిందోచ్
By: Tupaki Desk | 25 April 2018 4:30 AM GMTతెలంగాణ అధికారపక్షంలో నెంబర్ వన్ ఎవరన్న విషయం అందరికి తెలిసిందే. చిన్న పిల్లాడినైనా తడుముకోకుండా చెప్పేస్తారు. కానీ.. అన్ని తెలిసిన రాజకీయ నేతలు మొదలు మీడియాకు చెందిన వారు సైతం టీఆర్ఎస్ లో నెంబర్ టూ ఎవరంటే మాత్రం చప్పున సమాధానం చెప్పరు. జవాబు చెప్పే ముందు కొన్ని ప్రశ్నలు అడగటం కనిపిస్తుంది. అదేమీ లేకుండా.. సూటిగా.. స్పష్టంగా టీఆర్ ఎస్ లో నెంబర్ 2 ఎవరు? అదెలా చెప్పగలరన్న ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పటం కనిపించదు.
కానీ.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అలాంటి తడబాటు ఏమీ అక్కర్లేదు. గులాబీ పార్టీలో కేసీఆర్ తర్వాతి స్థానం ఎవరిదన్న విషయం ఇట్టే చెప్పేయొచ్చు. ఈ నెల 27 నుంచి తెలంగాణ ప్లీనరీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పనులన్నీ కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన కాకుండా.. పలువురు నేతలు ఈ పనుల్ని చూస్తున్నా.. కేసీఆర్ తర్వాత ఆ పనులకు బాధ్యుడిగా వ్యవహరిస్తున్నారు కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్. ఇప్పటివరకూ పార్టీలో నెంబర్ 2 మీద విపరీతమైన చర్చ జరిగేది. ఇటీవల కాలంలోపార్టీ మీద పట్టు తెచ్చుకుంటున్న కేటీఆర్.. రెండో స్థానం మీద అనవసరమైన చర్చ అవసరం లేదన్న రీతిలో.. పగ్గాల్ని ఒడుపుగా ఒడిసిపట్టుకున్నట్లుగా చెబుతున్నారు.
టీఆర్ ఎస్ పార్టీలో రెండోస్థానం కోసం కేసీఆర్ కుమార్తె కవిత.. మేనల్లుడు హరీశ్ లాంటి వారి పోటీ లేకపోలేదు. అయితే.. వారంతా తన తర్వాతేనన్న విషయాన్ని కేటీఆర్ చాలా తెలివిగా చెప్పేస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్లీనరీ నిర్వహణ విషయంలో మంత్రి కేటీఆర్ బాధ్యుడిగా వ్యవహరించటం.. కీలకాంశాల మీద ఆయన చేస్తున్న సూచనలు చూసినప్పుడు నెంబర్ 2 స్థానాన్ని కేటీఆర్ తనకు తానే తీసేసుకున్నట్లుగా చెబుతున్నారు. కేటీఆర్ చొరవను స్వాగతించే రీతిలో కేసీఆర్ రియాక్షన్ ఉండటంతో.. ఇప్పటివరకూ ఉన్న సందేహాలు తీరిపోయినట్లేనని.. పార్టీలో నెంబర్ 2 కేటీఆర్ అన్న విషయం తేలిపోయిందన్న మాట పలువురి నోటి నుంచి వస్తున్నాయి. ప్లీనరీ పుణ్యమా అని గులాబీ పార్టీలో నెంబర్ 2 పై క్లారిటీ వచ్చేసిందని చెప్పక తప్పదు.
కానీ.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అలాంటి తడబాటు ఏమీ అక్కర్లేదు. గులాబీ పార్టీలో కేసీఆర్ తర్వాతి స్థానం ఎవరిదన్న విషయం ఇట్టే చెప్పేయొచ్చు. ఈ నెల 27 నుంచి తెలంగాణ ప్లీనరీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పనులన్నీ కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన కాకుండా.. పలువురు నేతలు ఈ పనుల్ని చూస్తున్నా.. కేసీఆర్ తర్వాత ఆ పనులకు బాధ్యుడిగా వ్యవహరిస్తున్నారు కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్. ఇప్పటివరకూ పార్టీలో నెంబర్ 2 మీద విపరీతమైన చర్చ జరిగేది. ఇటీవల కాలంలోపార్టీ మీద పట్టు తెచ్చుకుంటున్న కేటీఆర్.. రెండో స్థానం మీద అనవసరమైన చర్చ అవసరం లేదన్న రీతిలో.. పగ్గాల్ని ఒడుపుగా ఒడిసిపట్టుకున్నట్లుగా చెబుతున్నారు.
టీఆర్ ఎస్ పార్టీలో రెండోస్థానం కోసం కేసీఆర్ కుమార్తె కవిత.. మేనల్లుడు హరీశ్ లాంటి వారి పోటీ లేకపోలేదు. అయితే.. వారంతా తన తర్వాతేనన్న విషయాన్ని కేటీఆర్ చాలా తెలివిగా చెప్పేస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్లీనరీ నిర్వహణ విషయంలో మంత్రి కేటీఆర్ బాధ్యుడిగా వ్యవహరించటం.. కీలకాంశాల మీద ఆయన చేస్తున్న సూచనలు చూసినప్పుడు నెంబర్ 2 స్థానాన్ని కేటీఆర్ తనకు తానే తీసేసుకున్నట్లుగా చెబుతున్నారు. కేటీఆర్ చొరవను స్వాగతించే రీతిలో కేసీఆర్ రియాక్షన్ ఉండటంతో.. ఇప్పటివరకూ ఉన్న సందేహాలు తీరిపోయినట్లేనని.. పార్టీలో నెంబర్ 2 కేటీఆర్ అన్న విషయం తేలిపోయిందన్న మాట పలువురి నోటి నుంచి వస్తున్నాయి. ప్లీనరీ పుణ్యమా అని గులాబీ పార్టీలో నెంబర్ 2 పై క్లారిటీ వచ్చేసిందని చెప్పక తప్పదు.