Begin typing your search above and press return to search.
కూల్చేయాలంటే హోదా తీసేస్తారా సారూ?
By: Tupaki Desk | 24 Jun 2019 4:41 AM GMTరాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? అన్న సామెత గుర్తుకు వచ్చేలా పరిస్థితి నెలకొంది. తనకు నచ్చని వాటి విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత కరకుగా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. దానికి నమ్మకం తోడైతే.. ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే గులాబీ బాస్ తాజాగా అదే విషయాన్ని చేతల్లో చూపిస్తున్నారు.
సచివాలయానికి వాస్తు లోపం ఉందన్న నమ్మకంతో ఉన్న కేసీఆర్.. భవనాలు పాతవైన కారణాన్ని చూపించి కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టెండర్ల దశ వరకూ తీసుకొచ్చిన ప్రభుత్వం మరో ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది. సచివాలయాన్ని మొత్తంగా కూల్చేసి.. చతురస్త్రాకారంలో నిర్మించాలని భావిస్తున్నారు.
ఇందుకు సర్వహిత బ్లాక్ అడ్డుకానుంది. ఎందుకంటే.. ఈ కట్టడం పురాతనమైనదే కాదు.. వారసత్వ కట్టడంగా హోదా ఉంది. ఇలా హోదా ఉన్న భవనాల్ని కూల్చివేయటానికి నిబంధనలు అడ్డు వస్తాయి. అయితే.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కి నచ్చనప్పుడు ఎంత హోదా ఉన్న భవనమైతే మాత్రం నిలుస్తుందా? తాజా ఎపిసోడ్ లోనూ అదే పరిస్థితి.
వారసత్వ కట్టడంగా ఉన్న సర్వహిత బ్లాక్ ను కూల్చివేయటానికి వీలుగా..ఆ భవనానికి ఇప్పటివరకూ ఉన్న వారసత్వ కట్టడం హోదాను తీసివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో.. కేసీఆర్ అనుకున్నట్లుగా సచివాలయాన్ని మొత్తంగా నేలమట్టం చేసి.. తాను కోరుకున్నట్లుగా కొత్త భవనాన్ని నిర్మించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఈ భవనం కోసం రూ.400కోట్లతో నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించటం తెలిసిందే.
సచివాలయానికి వాస్తు లోపం ఉందన్న నమ్మకంతో ఉన్న కేసీఆర్.. భవనాలు పాతవైన కారణాన్ని చూపించి కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టెండర్ల దశ వరకూ తీసుకొచ్చిన ప్రభుత్వం మరో ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది. సచివాలయాన్ని మొత్తంగా కూల్చేసి.. చతురస్త్రాకారంలో నిర్మించాలని భావిస్తున్నారు.
ఇందుకు సర్వహిత బ్లాక్ అడ్డుకానుంది. ఎందుకంటే.. ఈ కట్టడం పురాతనమైనదే కాదు.. వారసత్వ కట్టడంగా హోదా ఉంది. ఇలా హోదా ఉన్న భవనాల్ని కూల్చివేయటానికి నిబంధనలు అడ్డు వస్తాయి. అయితే.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కి నచ్చనప్పుడు ఎంత హోదా ఉన్న భవనమైతే మాత్రం నిలుస్తుందా? తాజా ఎపిసోడ్ లోనూ అదే పరిస్థితి.
వారసత్వ కట్టడంగా ఉన్న సర్వహిత బ్లాక్ ను కూల్చివేయటానికి వీలుగా..ఆ భవనానికి ఇప్పటివరకూ ఉన్న వారసత్వ కట్టడం హోదాను తీసివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో.. కేసీఆర్ అనుకున్నట్లుగా సచివాలయాన్ని మొత్తంగా నేలమట్టం చేసి.. తాను కోరుకున్నట్లుగా కొత్త భవనాన్ని నిర్మించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఈ భవనం కోసం రూ.400కోట్లతో నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించటం తెలిసిందే.