Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాట‌..దేశానికి దారి చూపుతున్న తెలంగాణ‌

By:  Tupaki Desk   |   21 April 2017 9:35 AM GMT
కేసీఆర్ మాట‌..దేశానికి దారి చూపుతున్న తెలంగాణ‌
X
తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆవిర్భ‌వించి 15 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా జరుగుతున్న టీఆర్ ఎస్ ప్లీనరీలో పార్టీ అధ్య‌క్షుడు - తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసగించారు. ఈ సంద‌ర్భంగా భారతదేశానికే తెలంగాణ ఓ దిక్సూచి అని కేసీఆర్ పేర్కొన్నారు. అధ్యక్షుడిగా వరుసగా 8వసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పార్టీ నాయకులకు ధన్యవాదాలు - ఉద్యమాభివందనాలు సీఎం కేసీఆర్ చెప్పారు. 2001లో తెలంగాణ ఆగమై పోయిన సందర్భంలో జై తెలంగాణ నినాదంతో టీఆర్ ఎస్ పార్టీ ఏర్పడిందన్నారు. గులాబీ జెండా ఎగిరినప్పటి నుంచి అన్ని అనుమానాలేన‌ని గుర్తు చేసుకున్నారు. ఈ పార్టీ నిలబడేది కాదని పేర్కొంటూ 15 ఏళ్ల టీఆర్ ఎస్ పోరాటంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని కేసీఆర్ తెలిపారు.

కోటి ఎకరాలకు నీళ్లందించే విధంగా ఇరిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నామని కేసీఆర్ ప్ర‌క‌టించారు. భయంకరమైన గుర్రపు డెక్కతో ఇరిగేషన్ వ్యవస్థ - రెండేళ్లు భయంకరమైన కరువు - రైతులు - చేనేతల ఆత్మహత్యలు - గుడుంబా రాజ్యం - భయంకరమైన పరిస్థితిలో ఆర్టీసీ ఉండేదన్నారు. సెక్రటేరియట్ లో తెలంగాణ ఉద్యోగులపై అణచివేతలు వంటి సమస్యలతో రాష్ట్రం ఉండేదన్నారు. ఈ క్రమంలో గులాబీ పార్టీ ఉద్యమ పోరాటం చేసి.. కేంద్రం ప్రభుత్వం మెడలు వంచి.. 2014లో తెలంగాణ తెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ``ఆనాడు కాంగ్రెస్ మాజీ సీఎం కట్టెపట్టుకొని కరెంటు కష్టాలు వస్తాయన్నారు.. కానీ 9వేల 350 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం. మిషన్ భగీరథ - మిషన్ కాకతీయ - హరీతహారం వంటి పథకాలతో అభివృద్ధి చేసుకుంటున్నాం. నేషనల్ హైవేస్ 2వేల 500కి.మీ ఉండేవి.. ఇవాళ 5 వేల 800 కి.మీ జాతీయ రహదారులను అభివృద్ధి చేసుకున్నాం ``అని స్పష్టం చేశారు.

గ్రామీణ వ్యవస్థను బాగు పరచుకున్నామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ``కులవృత్తుల వాళ్లకు గొర్రెలు అందిస్తున్నాం. 25 వేల ఆధునిక క్షౌరశాలలు ఏర్పాటు చేస్తాం. రజకులకు వాషింగ్ మిషన్ లు, నూత‌న‌ ధోబీ ఘాట్ లను నిర్మించి ఇస్తాం. రంగారెడ్డి - హైదరాబాద్ లలో కల్లు దుకాణాలను ఆనాటి ప్రభుత్వాలు కల్తీ కల్లు అని బ్యాన్ చేయగా మళ్లీ పునరుద్ధరించుకున్నాం. బెస్తవాళ్లు - ముదిరాజ్ లకు చేపలు పంపిణీ చేస్తున్నాం. మత్స్య పరిశ్రమను ఏడాదికి 5 వేల కోట్ల ఆదాయం వచ్చే విధంగా అభివృద్ధి చేసుకుంటున్నాం``అని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయం అంటే పిల్లనివ్వడానికి వెనక్కి తగ్గే రోజులు పోయాయని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయం అంటే ఏమిటో గడిచిన రెండు సంవత్సరాలు చేసి చూపించామని వెల్ల‌డించారు. త్వరలోనే వ్యవసాయ శాఖలో 500 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/