Begin typing your search above and press return to search.

మళ్లీ ఎంసెట్ తప్పదు.. కేసీఆర్ కన్ఫర్మ్

By:  Tupaki Desk   |   29 July 2016 2:41 PM GMT
మళ్లీ ఎంసెట్ తప్పదు.. కేసీఆర్ కన్ఫర్మ్
X
కొందరి తప్పు అందరి పాలిట శాపంగా మారిన ఉదంతం ఇది. తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్వహించిన ఎంసెట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష పత్రాలు లీక్ కావటం.. భారీ కుంభకోణం చోటు చేసుకున్న ఈ ఉదంతంపై తెలంగాణ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంతమంది చేసిన తప్పునకు అందరిని బాధ్యుల్ని చేసేలా కేసీఆర్ నిర్ణయం ఉండటం గమనార్హం. ఎంసెట్ 2 లీకు వ్యవహారంలో 100 నుంచి 150 మధ్యన తప్పు చేసి ఉండొచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది.

ఈ ఉదంతాన్ని విచారించిన సీఐడీ సైతం.. లీకులో మ్యాగ్జిమం 150 మందికి మించి భాగస్వామ్యం ఉందని తేల్చారు. ఈ నేపథ్యంలో దాదాపు 56 వేల మంది విద్యార్థులు.. వారి కుటుంబాలకు మనోవ్యధను కలిగించేలా పరీక్ష రద్దు నిర్ణయాన్ని తీసుకోవద్దంటూ విద్యార్థులు తల్లిదండ్రులు.. విద్యార్థులు.. పలువురు అధ్యాపకులు విన్నవించారు.

తాజా ఉదంతంపై సుదీర్ఘంగా సమీక్ష జరిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంసెట్ 2 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయంతో వేలాది మంది మరోసారి ప్రవేశ పరీక్షను రాయాల్సి ఉంటుంది. దీంతో.. మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులకు తెలంగాణ సీఎం తీసుకున్న నిర్ణయం శరాఘాతంగా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.