Begin typing your search above and press return to search.
తొలిదశలోనే జగన్ హవా కనిపిస్తోందిగా!
By: Tupaki Desk | 23 May 2019 3:43 AM GMTఎంతకాలంగానో ఎదురుచూస్తున్న టైం వచ్చేసింది. కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. నూటికి వెయ్యి శాతం టీడీపీ గెలుపు ఖాయమంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటల్లో పస లేదన్న విషయం కౌంటింగ్ స్టార్టింగ్ లో తెలిపోయింది. కౌంటింగ్ ఆరంభంలోనే ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిక్యత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని బాబు అనుకూలురుగా చెప్పే మీడియా సంస్థల ఛానళ్లలోనూ స్పష్టమవుతోంది.
ప్రాథమికంగా చూస్తే.. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిక్యత క్లియర్ కట్ గా కనిపిస్తోంది. టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య అధిక్యత అంతరం డబుల్ గా ఉండటం చూస్తే.. తుది ఫలితం ఎలా ఉంటుందో ఇట్టే అర్థమయ్యే పరిస్థితి. ఆరంభంలో రెండు పార్టీల మధ్య వ్యత్యాసం చూస్తుంటే.. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 120 సీట్లకు కాస్త అటూ ఇటుగా సాధించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు తెలంగాణలో టీఆర్ ఎస్ అధిక్యత విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్న విషయంపై క్లారిటీ వచ్చేసినట్లే. ప్రాథమికంగా చూసినప్పుడు టీఆర్ ఎస్ అధిక్యత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. దీంతో.. కేసీఆర్ చెప్పిన జోస్యం ఫలించే అవకాశం ఉందన్న భావన కలుగుతోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే కేంద్రంలో ఎన్డీయే సర్కారు మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమన్న వైనం తాజాగా వస్తున్న ఫలితాల్ని చూస్తుంటే అర్థమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్లే ఎన్డీయే కూటమికి విజయం ఖాయమన్నట్లుగా ఆరంభ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు.
ప్రాథమికంగా చూస్తే.. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిక్యత క్లియర్ కట్ గా కనిపిస్తోంది. టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య అధిక్యత అంతరం డబుల్ గా ఉండటం చూస్తే.. తుది ఫలితం ఎలా ఉంటుందో ఇట్టే అర్థమయ్యే పరిస్థితి. ఆరంభంలో రెండు పార్టీల మధ్య వ్యత్యాసం చూస్తుంటే.. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 120 సీట్లకు కాస్త అటూ ఇటుగా సాధించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు తెలంగాణలో టీఆర్ ఎస్ అధిక్యత విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్న విషయంపై క్లారిటీ వచ్చేసినట్లే. ప్రాథమికంగా చూసినప్పుడు టీఆర్ ఎస్ అధిక్యత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. దీంతో.. కేసీఆర్ చెప్పిన జోస్యం ఫలించే అవకాశం ఉందన్న భావన కలుగుతోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే కేంద్రంలో ఎన్డీయే సర్కారు మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమన్న వైనం తాజాగా వస్తున్న ఫలితాల్ని చూస్తుంటే అర్థమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్లే ఎన్డీయే కూటమికి విజయం ఖాయమన్నట్లుగా ఆరంభ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు.