Begin typing your search above and press return to search.
జగన్ నిర్ణయాల ఎఫెక్ట్..బాబు ఫ్యూచర్ ప్లాన్ ఇదేనట
By: Tupaki Desk | 12 Jun 2019 4:07 PM GMTఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రతిపక్షానికి గొంతు ఎత్తే అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న ఆయన.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పలు ఫైళ్లపై సంతకాలు కూడా చేసేశారు. మిగిలిన వాటిని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో కూడా చెప్పేశారు. దీంతో చంద్రబాబు నాయకత్వంలోని ప్రతిపక్షానికి ఏమాత్రం ప్రశ్నించే అవకాశం దొరకడం లేదు.
దీంతో తెలుగుదేశం పార్టీ ఏం చేయాలి..? ప్రజలను ఎలా మెప్పించాలి..? అనే అంశాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మంగళవారం ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. జగన్ తమకు అవకాశం ఇవ్వకుంటే ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రభుత్వంపై బురద జల్లాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారట. ఇలా చేస్తే అసలుకే ఎసరు వస్తుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించాలని ఎమ్మెల్యేలు - నేతలకు ఆయన దిశానిర్ధేశం చేశారని తెలిసింది. ఇదే అసెంబ్లీలోనూ కొనసాగించాలని అన్నారట చంద్రబాబు.
అంతేకాదు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఏదైనా అవకాశం దొరికినప్పుడు మాత్రమే రెచ్చిపోవాలని - లేకుంటే ప్రజా సమస్యలపైనే ఎక్కువగా దృష్టి సారించాలని కూడా ఆయన చెప్పారట. దీనితో పాటు అసెంబ్లీలో అనవసర రాద్ధాంతం చేయడం.. సభ నుంచి వాకౌట్ అవడం వంటివి అస్సలు చేయకూడదని చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి తక్కువ మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా.. రాష్ట్రంలో బలమైన - బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రజల్లో పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆయన అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
వాస్తవానికి ప్రజలకు ఇచ్చిన హామీల అమలు - ఫలితాల సాధనకు కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది. అనేక ఆశలతో ప్రజలు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు కాబట్టి వాటిని నెరవేర్చడానికి కొత్తగా వచ్చిన వారికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీ భావిస్తోంది. అందుకే అప్పుడే తొందరపడి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదంటున్నారు ఆ పార్టీ నేతలు. ఈ విషయంపై పార్టీ అధినేత కూడా నాయకులు ఎవరూ తొందరపడాల్సిన అవసరం లేదంటూ సూచించారు. అదే సమయంలో జగన్ మాత్రం సంక్షేమంలో దూసుకుపోతున్నారు.
దీంతో తెలుగుదేశం పార్టీ ఏం చేయాలి..? ప్రజలను ఎలా మెప్పించాలి..? అనే అంశాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మంగళవారం ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. జగన్ తమకు అవకాశం ఇవ్వకుంటే ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రభుత్వంపై బురద జల్లాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారట. ఇలా చేస్తే అసలుకే ఎసరు వస్తుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించాలని ఎమ్మెల్యేలు - నేతలకు ఆయన దిశానిర్ధేశం చేశారని తెలిసింది. ఇదే అసెంబ్లీలోనూ కొనసాగించాలని అన్నారట చంద్రబాబు.
అంతేకాదు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఏదైనా అవకాశం దొరికినప్పుడు మాత్రమే రెచ్చిపోవాలని - లేకుంటే ప్రజా సమస్యలపైనే ఎక్కువగా దృష్టి సారించాలని కూడా ఆయన చెప్పారట. దీనితో పాటు అసెంబ్లీలో అనవసర రాద్ధాంతం చేయడం.. సభ నుంచి వాకౌట్ అవడం వంటివి అస్సలు చేయకూడదని చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి తక్కువ మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా.. రాష్ట్రంలో బలమైన - బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రజల్లో పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆయన అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
వాస్తవానికి ప్రజలకు ఇచ్చిన హామీల అమలు - ఫలితాల సాధనకు కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది. అనేక ఆశలతో ప్రజలు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు కాబట్టి వాటిని నెరవేర్చడానికి కొత్తగా వచ్చిన వారికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీ భావిస్తోంది. అందుకే అప్పుడే తొందరపడి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదంటున్నారు ఆ పార్టీ నేతలు. ఈ విషయంపై పార్టీ అధినేత కూడా నాయకులు ఎవరూ తొందరపడాల్సిన అవసరం లేదంటూ సూచించారు. అదే సమయంలో జగన్ మాత్రం సంక్షేమంలో దూసుకుపోతున్నారు.