Begin typing your search above and press return to search.
ఆమెను చంపింది మా అమ్మే!
By: Tupaki Desk | 27 Aug 2015 9:14 AM GMTషీనా బోరా హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ హత్య కేసులో కన్నతల్లి ఇంద్రాణి ముఖర్జీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే, షీనా బోరాను ఆమె ఎందుకు హత్యచేసిందో ఆ కారణాలు తనుకు స్పష్టంగా తెలుసు అంటున్నాడు కుమారుడు మిఖైల్ బోరా. తన తల్లి పోలీసుల సమక్షంలో నేరాన్ని అంగీకరించకపోతే తాను రంగంలోకి దిగుతానని చెబుతున్నాడు.
2012లో షీనా బోరా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమె చనిపోవడానికి.. ఇంద్రాణీ చేసుకున్న పెళ్లిళ్ల వ్యవహారమే కారణం కావొచ్చన్న కథనాలు వెలువడ్డాయి. ఇంద్రాణి 2002లో స్టార్ ఇండియా మాజీ అధిపతి పీటర్ ముఖర్జియాను వివాహం చేసుకున్నారు. అయితే, ఆమెకు అంతకుపూర్వమే జరిగిన రెండు పెళ్లిళ్ల విషయం ముఖర్జియా ముందు దాచారట. విడాకుల సంగతి కూడా ఆయనకి తెలీదట. ఆ తరువాత, చోటుచేసుకున్న గొడవల నేపథ్యంలో షీనా బోరా హత్యకి గురయ్యారు. అయితే, షీనా చనిపోయిన సంగతిని దాచిపెట్టేందుకు ఇంద్రాణీ చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి షీనా హత్యలో ఇంద్రాణి పాత్ర ఉందని తేలింది. దీంతో గత బుధవారంనాడు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కుమారుడు మిఖైల్ ఇప్పడు స్పందిస్తుండటం చర్చనీయం అవుతోంది.
‘నా సోదరి చావుకు చాలా కారణాలున్నాయి. ఆమెను మా అమ్మే చంపిందని నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకు చంపిందో... దాని వెనకున్న కారణాలేంటో నాకు తెలుసు. అయితే, ఈ నెలాఖరు వరకూ ఇంద్రాణి పోలీస్ కస్టడీలో ఉంటున్నారు. కాబట్టి, పోలీసులు ఆమె నుంచి నిజం రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఆమె ఈ హత్యకు సంబంధించి పోలీసులకు సరైన సమాచారం ఇవ్వని పక్షంలో నేను నోరు విప్పుతాను. హత్యకు గల కారణాలన్నీ బయటపెడతాను’ అంటున్నాడు మిఖైల్.
2012లో షీనా బోరా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమె చనిపోవడానికి.. ఇంద్రాణీ చేసుకున్న పెళ్లిళ్ల వ్యవహారమే కారణం కావొచ్చన్న కథనాలు వెలువడ్డాయి. ఇంద్రాణి 2002లో స్టార్ ఇండియా మాజీ అధిపతి పీటర్ ముఖర్జియాను వివాహం చేసుకున్నారు. అయితే, ఆమెకు అంతకుపూర్వమే జరిగిన రెండు పెళ్లిళ్ల విషయం ముఖర్జియా ముందు దాచారట. విడాకుల సంగతి కూడా ఆయనకి తెలీదట. ఆ తరువాత, చోటుచేసుకున్న గొడవల నేపథ్యంలో షీనా బోరా హత్యకి గురయ్యారు. అయితే, షీనా చనిపోయిన సంగతిని దాచిపెట్టేందుకు ఇంద్రాణీ చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి షీనా హత్యలో ఇంద్రాణి పాత్ర ఉందని తేలింది. దీంతో గత బుధవారంనాడు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కుమారుడు మిఖైల్ ఇప్పడు స్పందిస్తుండటం చర్చనీయం అవుతోంది.
‘నా సోదరి చావుకు చాలా కారణాలున్నాయి. ఆమెను మా అమ్మే చంపిందని నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకు చంపిందో... దాని వెనకున్న కారణాలేంటో నాకు తెలుసు. అయితే, ఈ నెలాఖరు వరకూ ఇంద్రాణి పోలీస్ కస్టడీలో ఉంటున్నారు. కాబట్టి, పోలీసులు ఆమె నుంచి నిజం రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఆమె ఈ హత్యకు సంబంధించి పోలీసులకు సరైన సమాచారం ఇవ్వని పక్షంలో నేను నోరు విప్పుతాను. హత్యకు గల కారణాలన్నీ బయటపెడతాను’ అంటున్నాడు మిఖైల్.