Begin typing your search above and press return to search.

కుమార్తె శ‌వానికి మేక‌ప్ వేసిన ఇంద్రాణి

By:  Tupaki Desk   |   5 Sep 2015 12:30 PM GMT
కుమార్తె శ‌వానికి మేక‌ప్ వేసిన ఇంద్రాణి
X
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన షీనా బోరా హ‌త్య‌కేసులో సంచలనాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులు ఒక్కోటి వీడుతున్నాయి. కుమార్తెను హ‌త్య చేశాక‌..ఆమెను రాయ‌ఘ‌డ్ అడ‌వుల్లో ద‌హ‌నం చేసే వ‌ర‌కు ఇంద్రాణి ఏం చేసిందో తెలుసుకుంటే మ‌న‌కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బుర్ర గిరా గిరా తిర‌గాల్సిందే. 2012 ఏప్రిల్ 24న ముంబైలోని తన ఇంట్లో షీనాబోరాను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఆ రోజు రాత్రి షీనా శ‌వాన్ని త‌న ఇంట్లోనే ఉంచేసింది.

మ‌రుస‌టి రోజు ఏప్రిల్ 25న కారు డ్రైవ‌ర్‌ శ్యామ్ రాయ్‌, మాజీ భ‌ర్త సంజీవ్ ఖ‌న్నాతో క‌లిసి మృత‌దేహాన్ని రాయ్‌ గ‌ఢ్ అడ‌వుల‌కు తీసుకెళ్లి ద‌హ‌నం చేసింది. మృత‌దేహం త‌ర‌లించే స‌మ‌యంలో ఎవ్వ‌రికి చిన్న అనుమానం కూడా రాకుండా ఉండేందుకు షీనా మృత‌దేహానికి అంద‌మైన డ్రెస్ వేసి, పెదాల‌కు లిప్‌ స్టిక్ వేసి, త‌ల‌ను అందంగా దువ్వి, శ‌రీరానికి సుంగ‌ద ద్ర‌వ్యాల‌ను రాసింది.

ఆమె శ‌రీరం పాడ‌వ్వ‌కుండా ఉండ‌డంతో పాటు దుర్వాస‌న రాకుండా ఉండేందుకే షీనా ఇన్ని ఎత్తులు వేసిన‌ట్టు తెలుస్తోంది. మార్గం మధ్యలో పోలీసులు తనిఖీలు చేస్తున్నప్పుడు కారులో ఉన్న షీనా బోరా గురించి పోలీసులు అడిగితే..ఆమెకు అనారోగ్యంగా ఉండ‌డంతో నిద్ర‌పోతున్న‌ట్టు చెప్పి మేనేజ్ చేసింద‌ని పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది. అడవుల్లోకి శ‌వాన్ని తీసుకెళ్లాక పెట్రోల్ పోసి తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్‌లతో కలిసి శవాన్నిద‌హ‌నం చేసింది.

షీనా హత్యను చేసిన తర్వాత ముంబైకి తిరిగి వ‌చ్చిన ఆమె త‌న కంపెనీలో ప‌నిచేసే ఉద్యోగికి చెప్పి త‌న‌ కూతురి పేరిట హాట్ మెయిల్ ఖాతాను తెరిచింది. షీనా అమెరికాలో చాలా బిజీగా ఉంటోంద‌ని చెప్పి ఇంద్రాణి ఆ ఖాతా ఓపెన్ చేయించింద‌ట‌. ఆ మెయిల్ నుంచే ఆమె ప‌లువురికి మెయిల్స్ కూడా పంపింది. ఈ హ‌త్య కేసును మాయం చేసేందుకు ఇంద్రాణి చేసిన ప‌నులు చూస్తుంటే ఓ క్రైం థ్రిల్ల‌ర్ మూవీని త‌ల‌పిస్తోంది.