Begin typing your search above and press return to search.

బాంబు పేలుళ్ల నుంచి త‌ప్పించుకున్న జ‌గ‌న్ పార్టీ అభ్య‌ర్థి!

By:  Tupaki Desk   |   23 April 2019 6:42 AM GMT
బాంబు పేలుళ్ల నుంచి త‌ప్పించుకున్న జ‌గ‌న్ పార్టీ అభ్య‌ర్థి!
X
ఎన్నిక‌ల పూర్తి అయిన నేప‌థ్యంలో బ‌రిలో నిలిచిన వారంతా టెన్ష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు.. రిలాక్స్ అయ్యేందుకు వివిధ ప్రాంతాల‌కు వెళ్ల‌టం తెలిసిందే. తాజాగా అలా వెళ్లి.. భ‌యంక‌ర‌మైన పేలుళ్ల అనుభ‌వం నుంచి తృటిలో త‌ప్పించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి ఉదంతం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అన‌కాప‌ల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న గుడివాడ అమ‌ర్ నాథ్ ప్ర‌స్తుతం శ్రీ‌లంక‌లోనే ఉన్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత స్నేహితుల‌తో క‌లిసి ఆయ‌న శ్రీ‌లంక‌కు వెళ్లారు. ఆయ‌న బ‌స చేసిన కింగ్స్ జ్యూరీ హోట‌ల్ కు అత్యంత స‌మీపంలోనే బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

తృటిలో వారు పేలుళ్ల నుంచి త‌ప్పించుకున్న వైనం వారు తాజాగా వెల్ల‌డించారు. పేలుళ్లు చోటు చేసుకున్న వెంట‌నే శ్రీ‌లంక నుంచి తిరుగుప్ర‌యాణ‌మ‌య్యారు. దేవుడి ఆశీస్సులు.. ప్ర‌జ‌ల అభిమాన‌ట‌మే తాను పేలుళ్ల నుంచి తృటిలో త‌ప్పించుకున్న‌ట్లుగా అమ‌ర్ నాథ్ చెప్పారు.